Karate Kalyani.. బుల్లితెరపై ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందులో నటిస్తున్న నటీనటులు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఇదిలా ఉండగా గత ఆదివారం ఈ సీరియల్ లో నటిస్తున్న పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ప్రియుడు పూర్తిస్థాయిలో మనస్థాపానికి గురయ్యారు.. ఆయన ఎవరో కాదు అదే సీరియల్ లో నటిస్తున్న నటుడు చందు.. ఇక ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురైన చందు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు.. తన పుట్టినరోజు నాడు తన ప్రియురాలు లేదని .. తనను పిలుస్తోంది అంటూ చందు సూసైడ్ చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన తమ్ముడు తనకు దూరమయ్యాడు అంటూ ఈ ఘటన మీద స్పందిస్తూ ఎమోషనల్ అయ్యింది ప్రముఖ సీనియర్ నటి కరాటే కళ్యాణి..
చందు మరణం పై కరాటే కళ్యాణి వాట్సాప్ స్క్రీన్ షాట్ వైరల్..
తాజాగా తన తమ్ముడు చందు తో ఆమె చేసిన వాట్స్అప్ చాటింగ్ ను కూడా షేర్ చేస్తూ అసలు విషయాన్ని బయట పెట్టింది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ విషయానికి వస్తే.. నేనుండను చనిపోతాను అని నాతో అన్నాడు.. కానీ ధైర్యం చెప్పాను.. ఇక నాకు విషయం అర్థం అయి.. కావాలని పదేపదే అతనితో చాలాసార్లు మాట్లాడాను.. ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం.. వద్దు అని చెప్పాను.. కానీ నా మాట వినలేదు.. చందు ఆత్మహత్యను నేను ఆపలేకపోయాను.. చందు యాదవ్ అని నేను పిలిస్తే మీరు ఒక్కరే అలా పూర్తి పేరుతో పిలుస్తారు అని అనేవాడు.. విలన్ గ్యాంగ్ లో నా అసిస్టెంట్గా చాలా సీరియల్స్ చేశాడు.. త్రినయని సీరియల్ లో మేము కలిసి చేశాము.. నిన్న ఒకరోజు జర్నీలో ఉండి కాల్ చేయలేదు.. తమ్ముడు ఇంతలో ఇలా దూరం అవుతావని అనుకోలేదు.. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ వాట్సాప్ స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది కరాటే కళ్యాణి..
పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేక పోయిన చందు..
ఇకపోతే నేను ఇక్కడ ఉండలేను.. వెళ్లడమే కరెక్ట్.. ఇక్కడే ఉంటే పిచ్చోన్ని అయిపోతాను లేదా తాగుబోతుగా మారి ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలిగిస్తాను.. నేను వెళ్తున్నాను.. ఎవరికీ చెప్పకండి అంటూ ఇలా పలు రకాలుగా చందు చేసిన మెసేజ్లు కనిపిస్తున్నాయి.. ఇక కరాటే కళ్యాణి ఎంత భరోసా ఇద్దామని ప్రయత్నించినా.. ఎంత ధైర్యం చెప్పాలని చూసినా.. ఫలితం లేకుండా పోయింది.. మొత్తానికి అయితే చందు తాను అనుకున్నదే చేశాడు.. చివరికి తన ప్రేయసి ఆత్మలో కలిసిపోయాడు.. ఇక తన పవిత్ర మరణించిందని.. తనను పిలుస్తోంది అంటూ చెప్పి ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది.
చందు మరణం పై భార్య సంచలన కామెంట్లు..
అయితే తాజాగా ఈయన మరణం పై ఈయన భార్య శిల్ప సంచలన ఆరోపణలు చేస్తోంది. చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందిస్తూ…పవిత్ర జయరాం పరిచయమైన దగ్గర్నుంచి నాకూ.. చందూకి దూరం పెరిగింది. ఆమె వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నారు.. పవిత్ర వచ్చిన తర్వాత మా మధ్య గొడవలు జరిగాయి.. చందు , పవిత్ర జయరాం ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారు అంటూ శిల్ప తెలిపారు.. ఇక పవిత్ర చనిపోవడంతో చందు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఆమె స్పష్టం చేశారు.