Puri Jagannath : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ దర్శకుడు ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా ట్రెండ్ క్రియేట్ చేసాడు. ఎలాంటి హీరో అయినా సరే పూరి తో సినిమా చేస్తే అతడి క్యారెక్టరైజేషనే మారిపోతుంది. అలాంటి పూరి ఇప్పుడు వరుస పరాజయాల్లో ఉండగా, నిఖార్సయిన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు, ఇక ఇప్పుడు రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ సినిమాతో రానున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత నెక్స్ట్ ఎవరితో అని వార్తలు వస్తుండగా, నాగ్ పూరి కాంబో పై నెట్టింట వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. పూరి జగన్నాధ్- కింగ్ నాగార్జున కాంబో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘సూపర్’ ‘శివమణి’ సినిమాలు చేసారు. సూపర్ యావరేజ్ గా ఆడినా, శివమణి బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఆద్వయం మళ్లీ వీరు కలవలేదు. ఇప్పుడు రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ ఆ కాంబోలో సినిమా సెట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాగ్ తో హ్యాట్రిక్ కి ప్లాన్..
ఇక నాగార్జున ప్రస్తుతం కుబేర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్యనే పూరి అన్నపూర్ణ స్టూడియో లో నాగార్జునని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించారట. అది నచ్చడంతో నాగ్ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఇది పూరి మార్క్ పక్కా యాక్షన్ స్టోరీ అని వార్తలొస్తున్నాయి. పైగా ఈ కథకి ఫాంటసీ టచ్ కూడా ఉందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు పూరి ఏ జోనర్ ని టచ్ చేసింది లేదు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అనంతరం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన డబుల్ ఇస్మార్ట్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత పూరి నాగ్ స్టోరీపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే జస్ట్ కాన్సెప్ట్ స్టోరీ లైన్ మాత్రమే వినిపించిన పూరి స్టోరీ పూర్తిగా రెడీ అయ్యాక, నాగార్జున కూడా డేట్లు కేటాయించడానికి రెడీగానే ఉన్నారట. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర షూటింగ్ కూడా ముగింపు చేరుకుంది.
రెడీ అయితే వెంటనే స్టార్ట్?
అయితే నాగార్జున కుబేర పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు నవీన్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నారు. ఇది మల్టీస్టారర్ చిత్రమని సమాచారం. ఈ సినిమాతో పాటు పూరి (Puri Jagannath) స్టోరీ రెడీ అయితే, ఒకేసారి ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాలని నాగ్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూరి సినిమా అంటే ఎక్కువ రోజులు డేట్లు కూడా కేటాయించాల్సిన పనిలేదు. రెండు, మూడు నెలల్లోనూ షూటింగ్ చుట్టేస్తారు. కాబట్టి నవీన్ సినిమా కంటే ఈ చిత్రం వేగంగా షూట్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక పూరి చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్మించాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తలు నిజమైతే, ఈ సారి హ్యాట్రిక్ కాంబో ఆడియన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.