60Years For Suresh Productions : 60ఏళ్ళ సురేష్ ప్రొడక్షన్స్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో రికార్డులు..

60Years For Suresh Productions : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌స్థానం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మూవీ మోఘ‌ల్ డా.డి.రామానాయుడు స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ కొన్ని ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌లో సేవ‌లందిస్తోంది. ఆయన పెద్ద కుమారుడు సురేష్ పేరిట స్థాపించిన సంస్థ‌లో ఇప్ప‌టికే ఎన్నో గొప్ప చిత్రాలు రూపొందాయి. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌లు, టెక్నిషియన్స్ ప‌రిచ‌యం అయ్యారు. దేశంలో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు నిర్మించిన ఏకైక భార‌తీయ నిర్మాణ సంస్థ‌గానూ సురేష్ ప్రొడక్షన్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటికీ నిర్మిస్తూనే ఉంది. ఇక ఈ ఏడాది నేటితో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంస్థ నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా రాముడు భీముడు విడుదలై నేటికీ (మే 21 1964) 60 పూర్తి చేసుకోగా, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 60 వసంతాల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా విక్ట‌రీ వెంక‌టేష్ ట్విట‌ర్లో ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

60Years For Suresh Productions

ఎన్నో చిత్రాలతో.. రికార్డులు..రివార్డులు..

ఇక 1964 లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్రారంభ‌మైంది. తొలిసారి న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ హీరోగా ‘రాముడు భీముడు’ చిత్ర నిర్మాణం జ‌రిగింది. తాపి చాణక్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నిర్మాతగా రామానాయుడు పేరు తొలిసారి స్క్రీన్ మీద ప‌డింది. ఆ సినిమా అప్ప‌ట్లో భారీ విజ‌యం సాధించింది. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న నిర్మాత‌గా రామానాయుడు పేరు మారు మ్రోగిపోయింది. ఆ త‌ర్వాత ఆ సంస్థ‌ అప్ప‌టిత‌రం హీరోలంద‌రితో ఎన్నో సినిమాలు నిర్మించింది. అటుపై త‌ర్వాత త‌రం, నేటి జ‌న‌రేషన్ న‌టుల‌తోనూ క‌లిసి ప‌నిచేస్తుంది. ఈ బ్యానర్ లో ప్రేమ్ నగర్, సోగ్గాడు, దేవత, సంఘర్షణ, అహనా పెళ్ళంట, కలిసుందాం రా! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. ఎన్నో చిత్రాలను నిర్మించి ఆ సినిమాలకు అవార్డులు కూడా అందుకున్నారు.

- Advertisement -

చివరి శ్వాస వరకు సినిమాలే జీవితంగా మూవీ మొఘల్..

ఇక దాదాపు 6 దశాబ్దాలుగా రాముడు భీముడు నుండి ఇప్ప‌టివ‌ర‌కూ 60 ఏళ్లుగా (60Years For Suresh Productions) సినిమాలు నిర్మిస్తూనే ఉంది. రామానాయుడు చివ‌రి శ్వాస వ‌ర‌కూ సినిమాలు నిర్మించి నిర్మాత‌గా రికార్డు సృష్టించారు. దేశంలో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత‌గానూ చ‌రిత్ర సృష్టించారు. ఇక రామానాయుడు యాక్టివ్ గా ఉన్న రోజుల్లోనే ఆ సంస్థ బాధ్య‌త‌లు పెద్ద కుమారుడు సురేష్ కి అప్ప‌గించారు. అయినా వెనుకుండి కీల‌క బాధ్య‌త‌లు చూసుకునేవారు. అలాగే రెండ‌వ కుమారుడు విక్టరీ వెంకేటేష్ హీరోగా ఎన్నో సినిమాలు అదే నిర్మాణ సంస్థ‌లో జ‌రిగాయి. ఆయ‌న హీరోగా ప‌రిచ‌య‌మైంది కూడా సొంత నిర్మాణ సంస్థ‌లోనే అని తెలిసిందే. ఇక ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ పలు భాషల సినిమాలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే పెద్ద సినిమాలు ఈ మధ్య నిర్మించడం లేదు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 60 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ సంస్థ‌తో అనుబంధం ఉన్న వారు ఎందరో సోషల్ మీడియా లో విషెస్ తెలియ‌జేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు