Manam Re-Release: అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించిన సినిమా మనం. నాగేశ్వరరావు, నాగార్జున, అఖిల్, నాగచైతన్న, సమంత ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి స్ఫూర్తిని ఇస్తూ వారిని మరింత ఎదిగేందుకు సహాయపడింది.
ఇక తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రెండ్ చేరుతుంది. ఇటీవల ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మనం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రతి స్టార్ హీరో సినిమా కూడా మరోసారి రిలీజ్ చేస్తున్నారు.
Bookings open now pic.twitter.com/UgCdMIllTh
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 22, 2024
అలా ఒకప్పుడు ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు కూడా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటున్నాయి. మరి మనం సినిమా ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఇక తాజాగా ఓ పోస్టర్ను రిలీజ్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు వెల్లడించింది చిత్ర బృందం.