Katrina Kaif Pregnant : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి చాలా నెలలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అందులోకత్రినా బేబీ బంప్ తో కన్పించింది అంటూ ఏకంగా స్క్రీన్ షాట్లు షేర్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే కత్రినా కూడా అనుష్కనే ఫాలో అవుతున్నట్టుగా అన్పిస్తోంది. మరి ఇంతకీ కత్రినా ఫస్ట్ బేబీ ప్లాన్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
లండన్ వీధుల్లో కత్రినా..
కత్రినా, విక్కీ కౌశల్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పటికే రెండేళ్ళు గడిచి పోతోంది. రెండున్నర సంవత్సరాల తర్వాత మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు ఈ జంట అంటూ పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లండన్ వీధుల్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతునన్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియోను చూశాక త్వరలో కత్రినా, విక్కీ తల్లిదండ్రులు కాబోతున్నారని అంటున్నారు.
కత్రినా మొదటి బిడ్డకు జన్మనివ్వబోయేది అక్కడేనా?
తాజా సమాచారం ప్రకారం కత్రినా తన మొదటి బిడ్డకు లండన్లో జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కత్రినా సన్నిహితులే ఓ నేషనల్ మీడియాకు వెల్లడించినట్టు సమాచారం. దీంతో కత్రినా ప్రెగ్నెన్సీ కారణంగా ఆమెపై మీడియా స్పెషల్ ఫోకస్ ను తప్పించడానికే ఈ దంపతులు లండన్ వెళ్ళినట్టు తెలుస్తోంది.
అనుష్క బాటలోనే కత్రినా..
కత్రినా కైఫ్ ప్రస్తుతం లండన్ లో ఉండడంతో ఆమె కూడా అనుష్క బాటలోనే నడుస్తోంది అన్పిస్తోంది. అనుష్క శర్మ కూడా తన రెండవ బిడ్డకు కూడా లండన్ లోనే జన్మనిచ్చింది. ఇక్కడ మీడియాకు దూరంగా ఉండడానికే ఆమె లండన్ వెళ్ళిపోయింది. తీరా బేబీ పుట్టాక సోషల్ మీడియా ద్వారా అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. అలాగే కత్రినా కూడా ఇదే ప్లాన్ ను ఫాలో అవుతున్నట్టుగా అన్పిస్తోంది. ఏదైతేనేం కత్రినా, విక్కీ తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతుండడం సంతోషకరం అంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్.
పౌరసత్వం మాటేంటి?
కత్రినా కైఫ్ కు ఇండియన్ పౌరసత్వం లేదు. అంటే ఆమెకు ఇక్కడ ఓటు హక్కు లేదు. కత్రినా ఇండియన్ కాదన్న మాట. ఇండియాలో ఉన్నా కూడా ఆమె బ్రిటీష్ పౌరురాలు కావడంతో కత్రినాకు ఇక్కడ ఓటు వేసే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు తన ఫస్ట్ బేబీ ఆమె లండన్ లో పుట్టబోతుండడంతో ఆ న్యూ బార్న్ బేబీకి లండన్ పౌరసత్వం వస్తుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
విక్కీ సినిమాల విషయానికొస్తే..
విక్కీ కౌశల్ త్వరలో బ్యాడ్ న్యూజ్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్, ఫాతిమా సనా షేక్, నేహా ధూపియా కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. అలాగే విక్కీ లైనప్ లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఛావా అనే ఓ చారిత్రాత్మక మూవీ కూడా ఉంది. కత్రినా కైఫ్ చివరి సారిగా మెర్రీ క్రిస్మస్ మూవీలో కన్పించింది.