Anne Hathaway.. జూనియర్ ఎన్టీఆర్.. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు.. ఒకప్పుడు సౌత్ హీరోయిన్సే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలని ఎన్నో కలలు కనేవారు.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తరువాత ప్రపంచ స్థాయి బ్యూటీస్ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించాలని.. ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాకి పోయింది అనడంలో సందేహం లేదు ఈ క్రమంలోనే ఆయనతో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండగా.. అలాంటి వారిలో ప్రముఖ హాలీవుడ్ నటి.. ఆస్కార్ గ్రహీత అన్నే జాక్వెలిన్ హత్ వే కూడా ఒకరు..
అన్నే జాక్వెలిన్ హత్ వే సినిమాలు..
ఈమె తాజాగా ఆర్ఆర్ఆర్ టీం తో కలిసి పనిచేయాలని ఉందని చెబుతోంది. ఇంటర్ స్టెల్లార్, బ్రైడ్ వార్స్ , ప్యాసింజర్స్, లెస్ మిసెర్బుల్స్, ది ఇంటర్న్ వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రస్తావించింది.
ఎన్టీఆర్ తో నటించడం జీవిత ఆశయం..
తాజాగా అన్నే జాక్వెలిన్ హత్ వే మాట్లాడుతూ.. అందరికీ నచ్చినట్టే ఆర్ ఆర్ ఆర్ సినిమా నాకు కూడా నచ్చింది.. ఈ టీంలో ఎవరితోనైనా కలిసి పని చేయాలనుకుంటున్నాను అని ఆమె తెలిపింది. ఆ తర్వాత పర్టిక్యులర్గా ఒకరి పేరు చెప్పండి అనగానే ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు ఎన్టీఆర్తో నటించడం తన జీవిత ఆశయం అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది.. దీంతో మరొకసారి నెటిజెన్లు ఆర్.ఆర్.ఆర్ సినిమాను అందరికీ రీచ్ అయ్యేలా తెరకెక్కించిన రాజమౌళిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే హాలీవుడ్ నటి ఆస్కార్ గ్రహీత అన్నే జాక్వెలిన్ హత్ వే కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం.
ఆర్ ఆర్ ఆర్..
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సంయుక్తంగా నటించగా.. రాంచరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం కూడా.. ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటించిన విషయం తెలిసిందే. ఎన్నో ఆడిషన్స్ తర్వాత ఈమె ఈ చిత్రానికి సెలెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సినిమా లో శ్రియ, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషించారు.. సుమారుగా రూ.500 కోట్లు బడ్జెట్లో తెరకేక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.. ముఖ్యంగా ఈ సినిమా ఆస్కార్ అవార్డులను కూడా దక్కించుకోవడం గమనార్హం.
ఇకపోతే 2021 మార్చి 25న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని దాల్బీ థియేటర్లో 2023 మార్చి 12న జరిగిన 95 వ ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. అలాగే 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మొత్తం ఆరు జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా టీం తో కలిసి నటించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు.. మళ్లీ ఈ టీం జతకడుతుందో లేదో..