Chaurya Paatam: ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కథను అందిస్తున్న చౌర్య పాఠం మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు ఇంద్రరామ్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీకి డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చౌర్య పాఠం టీజర్ ను ఇటీవల విలక్షణ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు.
డిఫరెంట్ పాయింట్ తో ఈ టీజర్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతుంది. చౌర్య పాఠం మూవీ త్వరలో తెలుగు ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఈ మూవీ గురించి ఇంద్ర రాంపల్లి పది విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం కోసం దాదాపుగా రెండేళ్లు కష్టపడినట్లు హీరో వెల్లడించారు. యూనిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతున్నట్లు పేర్కొన్నారు.
హీరోగా ఇదే తన తొలి సినిమా అని ఇంద్రరామ్ చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తితో ఎన్నో సినిమా ఆఫర్ల చుట్టూ తిరిగిన.. కొన్ని అవకాశాలు వచ్చినట్లు వచ్చి జారిపోయాయి.. మరికొన్ని సినిమాలు కథలు నచ్చక నేను నో చెప్పాను.. ఎట్టకేలకు ఈ సినిమాతో మీ ముందుకి రాబోతున్న.. అంటూ తెలియజేశాడు హీరో. ప్రజెంట్ హీరో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.