Gayatri Gupta.. ప్రముఖ హీరోయిన్ గాయత్రీ గుప్తా తోటి హీరోయిన్స్ పై అసభ్యకర కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. అసలు ఎందుకు గాయత్రీ గుప్తా ఇలాంటి కామెంట్స్ చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీ..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోయిన్స్ ఏ విషయంపై స్పందించినా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.. ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్లు కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు.తాము మాట్లాడాలి అనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. అలాంటి వారిలో గాయత్రీ గుప్తా కూడా ఒకరు ..ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి భారీ గుర్తింపు సొంతం చేసుకుంది.. ఆ తర్వాత కొబ్బరి మట్ట , మిఠాయి వంటి సినిమాలలో సాంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. బయట మాత్రం చాలా బోల్డ్ గా కనిపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గునపాలు దింపుతూ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన గాయత్రీ గుప్తా. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి
అవకాశాల కోసం ఆ హీరోయిన్స్ పడుకుంటారు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైన గాయత్రీ గుప్తా మాట్లాడుతూ .. గతంలో నేను చేసిన పోరాటానికి అంతగా ఎవరు సపోర్ట్ చేయలేదు.. ఆ తర్వాత కొంతమంది నాలా పోరాటం చేయడం వల్ల ఇండస్ట్రీ స్పందించి ఒక కమిటీ వేశారు..అదే ఇప్పుడు చాలామంది బాధితులకు ఒక ఫ్లాట్ ఫామ్ అయింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కోచ్ వుందని గట్టిగా నేను చెబుతాను.. చాలామంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారం వంటివి చేస్తున్నారు. కొంతమంది అవసరాల కోసం అలాంటి వాటికి ఒప్పుకుంటున్నారు.. ముఖ్యంగా వాళ్లలో ఎక్కువమంది అమాయకపు అమ్మాయిలే బలి అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా.. మొత్తానికైతే హీరోయిన్స్ కొంతమంది అవకాశాల కోసం పడుకుంటున్నారని చెప్పి ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు హాట్ బాంబు పేల్చింది. ఈ ముద్దుగుమ్మ.. మరి ఈ విషయంపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి
గాయత్రీ గుప్తా సినిమాలు..
గాయత్రీ గుప్తా నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ -2 లాంటి చిత్రాలలో నటించింది . ఇక అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ,దుబాయ్, జంధ్యాల రాసిన ప్రేమ కథ, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ ,సీత ఆన్ ది రోడ్ వంటి చిత్రాలలో కూడా కనిపించింది . ఇక హీరోయిన్గా చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అలాంటి సమస్యతో బాధపడుతూ..
ఇదిలా ఉండగా తాజాగా ఈమె గత ఏడాది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే .. గత కొంతకాలంగా ఈమె ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నారని.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని గత ఏడాది చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఆరోగ్య పరిస్థితి కుదిటపడిందని తెలుస్తుంది ..ఇకపోతే ఆరు నెలల చికిత్స కోసమే రూ .10 లక్షల వరకు ఖర్చవుతుందని.. అంత డబ్బు తన దగ్గర లేదని.. ఇక చికిత్స కోసం ఫండింగ్ చేపట్టాలనుకుంటున్నానని ప్రకటించింది.. అంతే కాదు తన దృష్టిలో తండ్రి అనేవాడు లేడు అనే ఆలోచనలో బ్రతుకుతున్నట్లు వెల్లడించింది.