యూఏఈ ప్రభుత్వం 2019లో ఇతర దేశాలకు చెందిన వారికి శాశ్వతంగా దుబాయ్ లో నివాసం కల్పించడం కోసం ప్రవేశపెట్టిన అరుదైన గౌరవం గోల్డెన్ వీసా.. ఒక శాశ్వత నివాసమే కాకుండా వ్యాపారాలు ఇలా ఎన్నో ఉపయోగాలు ఈ గోల్డెన్ వీసా వల్ల లభిస్తాయి. మరి ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
షారుక్ ఖాన్:
బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ కి ఇష్టమైన దేశం దుబాయ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా లో ఆయన పుట్టినరోజు సందర్భంగా లేదా ఆయన సినిమాలు విడుదలకు ముందు తరచుగా ఆయనకు సంబంధించిన విషయాలను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక గోల్డెన్ వీసా అందుకున్న అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో ప్రథమ స్థానంలో ఉంటారు షారుక్ ఖాన్. అంతేకాదు తొలి గోల్డెన్ వీసా అందుకున్న భారతీయుడు కూడా ఈయనే..
రజనీకాంత్:
సూపర్ స్టార్ రజినీకాంత్ దేశ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంజూరు చేసిన యూఏఈ గోల్డెన్ వీసాను సొంతం చేసుకున్నారు.. గోల్డెన్ వీసా అందుకున్న తర్వాత ఆయన తన ట్విట్టర్ ద్వారా ఇలా ట్వీట్ చేశారు.. “అబుదాబి ప్రభుత్వం నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన యూఏఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా వుంది.. వీసాను సత్కరించిన అబుదాబి ప్రభుత్వానికి, నా మంచి స్నేహితుడు యూసుఫ్ అలీ MA, లులు గ్రూప్ యొక్క సీఎండి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కృతి సనన్:
మహేష్ బాబు హీరోగా నటించిన 1: నేనొక్కడినే.. అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో కూడా నటించింది. ఈమె కూడా యూఏఈ గోల్డెన్ వేసాను దక్కించుకుంది.
సంజయ్ దత్:
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈయన కూడా మే 2021లో యూఏఈ గోల్డెన్ వీసా ను దక్కించుకున్నారు.. తనకు వచ్చిన క్యాన్సర్ చికిత్స కారణంగా 2020 నుండి యూఏఈ తనకు తన కుటుంబానికి నివాసంగా మారిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
బోనీ కపూర్:
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత , దివంగత నటీమణి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా గోల్డెన్ వీసాను అందుకున్నారు.
సానియా మీర్జా:
జూలై 20 1 లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకుంది.. అంతే కాదు ఈ గోల్డెన్ వీసా అందుకున్న మూడవ భారతీయురాలిగా పేరు దక్కించుకుంది.
దుల్కర్ సల్మాన్:
మలయాళ నటుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన దుల్కర్ సల్మాన్ కూడా ఈ గోల్డెన్ వీసాను దక్కించుకున్నారు.
ఉపాసన:
అపోలో గ్రూప్స్ వారసురాలు, మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన కూడా గోల్డెన్ వీసాను అందుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దుబాయ్ గోల్డెన్ వీసాను దక్కించుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి:
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ గోల్డెన్ వీసాని దక్కించుకున్నారు. ఇటీవలే పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు ఈ గోల్డెన్ వీసాని కూడా అందుకోవడంతో అభిమానులే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీరితోపాటు ప్రణీత సుభాష్, మౌనీ రాయ్, సోనూ సూద్, సునీల్ శెట్టి, రణవీర్ సింగ్, నేహా కక్కర్, ఊర్వశీ రౌటేలా, వరుణ్ ధావన్ , మోహన్ లాల్, మమ్ముట్టి , టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ , లు ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు.