టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన వీవీ వినాయక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకి డైరెక్షన్ వహించి తన డైరెక్షన్ తో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు. ఇక తాజాగా ఈ టాలీవుడ్ దర్శకుడు అస్వస్థకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ మాస్ డైరెక్టర్లలో ఒకరైన వినాయక్.. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, రవితేజ తదితర స్టార్ హీరోల తో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక ప్రజెంట్ ఈనా ఎటువంటి సినిమాకి డైరెక్షన్ వహించడం లేదు.
గత కొంతకాలంగా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో నేడు అనగా మే 29న అస్వస్థకు గురయ్యారు. ఇక వెంటనే వైద్యులు స్పందించడంతో ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ అభిమాన డైరెక్టర్ కి ఏమైనా అవుతుందేమో అని తెగ కంగారుపడుతున్నారు వివి వినాయక్ అభిమానులు.