Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ విశ్వంభర. ఇందులో మెగాస్టార్ సరసన త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా విడుదలయ్యాయి. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ చాలా స్పీడ్ గా జరుగుతుంది.
ఈ క్రమంలో తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్, చిరంజీవి సినిమా షూటింగ్ సెట్ కి వెళ్లి ఆయనను సర్ప్రైజ్ చేశాడు. సెట్ కి వెళ్లి కాసేపు సమయం గడిపి ఫోటోలు కూడా దిగాడు అజిత్. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ” నిన్న సాయంత్రం విశ్వంభర సెట్ లోకి అనుకోకుండా ఓ అతిథి వచ్చారు. పక్క సెట్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ నా దగ్గరకు వచ్చి కాసేపు గడిపాడు. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
అజిత్ తెలుగులో మొదటి సినిమా ప్రేమ పుస్తకం సమయంలో చేసినప్పటికీ విషయాలు గుర్తు చేసుకున్నాం. ఆ మూవీ ఆడియో లాంచ్ నేనే చేశాను. అజిత్ భార్య షాలిని జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకున్నాం. అజిత్ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ అదే మంచితనంతో ఉన్నాడు ” అంటూ అటువీట్లో రాసుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రజెంట్ ఈట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.