Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఒక్క మాట కూడా చెప్పకుండా 3 సినిమాల నుంచి తప్పించారు అనే వార్త తాజాగా చక్కర్లు కొడుతోంది. అసలు పృథ్వీరాజ్ విషయంలో ఎందుకిలా చేశారు ? అనే వివరాల్లోకి వెళ్తే..
పృథ్వీరాజ్ కెరీర్ లో చీకటి దశ
నటుడు అన్నాక వాళ్ళ జీవితంలో విజయం, అపజయం రెండూ అనివార్యమైనవే. కానీ స్పాట్లైట్, గ్లామర్, సక్సెస్ మాత్రమే స్టార్స్ ను హైలైట్ చేస్తుంది. దీనివల్ల నటులలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. విజయం వెనుక లెక్కలేనన్ని పోరాటాలు, అపజయాలు, ఆత్మన్యూనతా క్షణాలు, పరాజయాల లోయలు ఉంటాయి. సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తన కెరీర్లో కష్టాలతో కూడిన దశను దాటాడు. ఇప్పుడు మీరు చూస్తున్న సూపర్స్టార్ గురించి పరిచయం అవసరం లేదు. కానీ ఈ దశకు చేరుకోవడానికి ఆయన కూడా ఎన్నో కష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చింది.
3 సినిమాల నుంచి తప్పించారు
వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ తన కెరీర్లో కష్టమైన దశ గురించి, చేతిలో ప్రాజెక్ట్లు లేని సమయం గురించి బహిరంగంగా మాట్లాడాడు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ”మలయాళంలో నాకు సినిమాలు లేని కాలం ఉండేది. నా కెరీర్లో తొలిసారి రెండు నెలలుగా సినిమాలు లేవు. స్టార్ కిడ్ అయినప్పటికీ నేను నటించాలనుకున్న మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. రెండు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు” అని గుర్తు చేసుకున్నారు.
ఇదే సమస్యా?
పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ కష్టాలు తప్పలేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ గొప్ప నటులు సుకుమారన్, మల్లిక కుమారుడు. తల్లిదండ్రులు ఇద్దరూ నటులు కావడంతో అదే ఆయనకు కెరీర్ మొదట్లో ఇబ్బందిగా మారింది. ఈ కారణం వల్ల ఒకప్పుడు అనేక మలయాళ చిత్రాలు పృథ్వీరాజ్ చేజారాయి. అలాగే ఆయన కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది
నెపోటిజంపై పృథ్వీరాజ్ కామెంట్స్
పృథ్వీరాజ్ సుకుమారన్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు నిజాయితీకి పెట్టింది పేరు అంటారు. ఇటీవల ఆయన నెపోటిజం అనే వివాదాస్పద అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించి వార్తల్లో నిలిచారు. పృథ్వీరాజ్ ఫస్ట్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ “నేను చిత్ర పరిశ్రమలోకి రావడం చాలా సులభంగా జరిగింది. నా ఇంటి పేరు వల్లనే నాకు మొదటి సినిమా వచ్చింది. నేను మంచి నటుడనని అందరూ అనుకున్నారు. నా మొదటి చిత్రానికి నా ఇంటిపేరుకు మాత్రమే రుణపడి ఉన్నాను” అన్నారు.
పృథ్వీరాజ్ నెక్స్ట్ ఏంటి?
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం బిజీ స్టార్ గా మారారు. ఇన్ని కష్టాలను ఎదుర్కొని తన టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఈ హీరోకు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మోహన్లాల్తో కలిసి ఎల్2 ఎంపురాన్ అనే మూవీని చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్లాల్, పృథ్వీరాజ్లతో పాటు టోవినో థామస్, ఇంద్రజిత్, మంజు వారియర్లు కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఎల్2 ఎంపురాన్ మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.