Star Hero : బాలీవుడ్ హీరో సన్నీడియోల్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2023లో విడుదలైన ‘గదర్ 2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయనకు డిమాండ్ పెరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సన్నీ డియోల్ చాలా మంది నిర్మాతలను మోసం చేశాడని అంటున్నారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత సౌరవ్ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సన్నీ గురించి షాకింగ్ నిజాలను వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ప్రావీణ్యం ఉన్న సౌరవ్ గుప్తా సినిమా నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సన్నీపై ఆయన మోసం, ఫోర్జరీ ఆరోపణలు చేయడం గమనార్హం.
అసలు వివాదం ఇదే
2016లో సన్నీ డియోల్కి సౌరవ్ గుప్తా ఒక సినిమాలో నటించేందుకు కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఇంకా సెట్ కాలేదు. సౌరవ్ మాట్లాడుతూ ‘అతనికి కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాం. కానీ మా సినిమా కాకుండా మరో సినిమాలో నటించాడు. అలాగే అతను నన్ను పదే పదే ఎక్కువ డబ్బు అడిగారు. ఇప్పటివరకు నా నుంచి 2.55 కోట్లు సన్నీ డియోల్ ఖాతాలోకి వెళ్లాయి’ అని సౌరవ్ గుప్తా తెలిపారు.
ఫోర్జరీ ఆరోపణలు
సన్నీ డియోల్పై కూడా ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. ‘కాంట్రాక్ట్ను చదివినప్పుడు అగ్రిమెంట్ హార్డ్ కాపీని చూసి సౌరవ్ ఆశ్చర్యపోయాను. సన్నీ ఫోర్జరీ చేశారని అర్థమైంది. రూ.4 కోట్లకు బదులు రూ.8 కోట్లకు రెమ్యూనరేషన్ ను మార్చారు అంటూ’ సౌరవ్ గుప్తా తెలిపారు. అంతేకాకుండా మరో కోటి రూపాయలు ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగారు అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు నిర్మాత. మరో నిర్మాత సునీల్ దర్శన్ కూడా తనను సన్నీ డియోల్ మోసం చేశారని ఆరోపించారు.
కొడుకు పెళ్లికి 50 లక్షల అప్పు
సన్నీ తన కొడుకు కరణ్ పెళ్లికి 50 లక్షలు అడిగాడని నిర్మాత సన్నీ పేర్కొన్నాడు. శాటిలైట్ అండ్ డిజిటల్ విక్రయాల ద్వారా ప్రాజెక్ట్ ఎక్కువ ఆదాయాన్ని పొందుతుందని చెప్పి రూ.50 లక్షలు తీసుకున్నారు అని వెల్లడించారు సౌరవ్. ఇక తాను సన్నీ డియోల్ను వ్యక్తిగతంగా సంప్రదించడానికి ప్రయత్నించినా ఆయన స్పందించలేదని అన్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో సన్నీ డియోల్కి 2.55 కోట్లు ఇచ్చామని ఇప్పటిదాకా సన్నీ తీరుతో విసిగిపోయిన నిర్మాత లెక్కలతో సహా ఏం జరిగిందో బయటపెట్టారు.
సన్నీపై నిర్మాత కంప్లైంట్
నిర్మాత సౌరవ్ గుప్తా సన్నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరుల సమావేశంలో సౌరవ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 30న సన్నీడియోల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన సిటీ శివార్లలో మిమ్మల్ని కలుస్తారు అంటూ సన్నీ ఆఫీసు నుంచి లేఖ వచ్చిందని తెలిపారు.
గొడవ అంతా ఈ మూవీ గురించే..
మీడియా కథనాల ప్రకారం సన్నీ డియోల్ ‘రామ జన్మభూమి’ సినిమాలో నటించేందుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ కు సంతకం చేశారట. కానీ ‘గదర్ 2’ హిట్ అయ్యాక అదే ‘రామ జన్మభూమి’ సినిమాకు 25 కోట్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారని అంటున్నారు.