Kriti Shetty: టాలీవుడ్ లో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న హీరోయిన్స్లో కృతి శెట్టి కూడా ఒకరు. తన అందం , అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అనంతరం రామ్ పోతినేని, నాని, నాగచైతన్య వంటి స్టార్స్ తో జతకట్టింది. ప్రజెంట్ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టిపై ఓ వార్త వైరల్ అవుతుంది.
అవకాశాల కోసం వేణు స్వామితో పూజలు చేయించుకునేందుకు కృతి శెట్టి ఇంట్రెస్ట్ చూపుతుంది. ఇప్పటికే రష్మిక మందన వంటి స్టార్ యాక్టర్స్ వేణు స్వామి తో పూజలు చేయించుకుని ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. ఇదేవిధంగా కృతి శెట్టి సైతం వేణు స్వామితో పూజలు చేయించుకుని మంచి స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది.