Krithishetty: నా డ్రీమ్ రోల్ అదే..అనుష్కపై కృతిశెట్టి కామెంట్స్‌ !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఉప్పెన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఉప్పెన సినిమా అనంతరం ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. మలయాళ, తమిళ భాషల్లో ఆఫర్స్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుందట. ఈ క్రమంలోనే నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. గతంలో ఒక్క సినిమాల్లో నటించినందుకు రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేదట. ప్రస్తుతం ఈ బ్యూటీ కోటిన్నర ఇచ్చిన కూడా చాలు సినిమాలు చేస్తా అని చెబుతోంది. ఇది ఇలా ఉండగా…. హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కృతి శెట్టి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో తన పాత్ర పేరు సుభద్ర. ఇప్పటివరకు నేను క్యూట్ అండ్ బబ్లీ రోల్స్ చాలా చేశాను. అయితే ఈ సినిమాలో నేను చాలా స్ట్రిక్ట్ రోల్ లో నటించాను.

ఈ సినిమాలో శర్వానంద్ అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చింది. మీకు ఎలాంటి పాత్రలు చేయడం ఇష్టం అని యాంకర్ అడగ్గా…..బాహుబలి సినిమాలో అనుష్క తరహాలో పాత్రలు చేయడం తన డ్రీమ్ రోల్ అని చెప్పుకొచ్చింది. యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలని ఉందని చెప్పింది. జయాపజయాల గురించి నేను పెద్దగా పట్టించుకోనని మీడియా సమావేశంలో కృతి శెట్టి చెప్పింది. ప్రస్తుతం తాను చెప్పిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు