Vignesh Shivan.. సినీ ఇండస్ట్రీలో ఎవరి కష్టాలు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం.. ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్నో అవస్థలు పడి. తినడానికి తిండి కూడా లేని సందర్భాలలో ఇండస్ట్రీకి వచ్చి.. ఆ తర్వాత తమ టాలెంట్ ను నిరూపించుకొని ఇండస్ట్రీలో ఉన్నత పోసిషన్ కి చేరుకుంటూ ఉంటారు.. అయితే అలా ఆ పొజిషన్ కు చేరుకున్న తర్వాత తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని.. కళ్ళు చమరుస్తూ ఉంటారు.. ఇప్పుడు అలాంటి వారిలో విగ్నేష్ శివన్ కూడా ఒకరు.. గతంలో ఆయన అనుభవించిన కష్టాలు ఇప్పుడు మళ్లీ గుర్తుకు రావడంతో ఎమోషనల్ గా.. సంతోషంతో ఒక పోస్ట్ షేర్ చేశాడు ..మరి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చేసిన ఆ పోస్ట్ ఏంటో? అందులో ఏముందో? ఇప్పుడు ఒకసారి చూద్దాం..
సౌత్ లేడీ సూపర్ స్టార్ తో ప్రేమ, పెళ్లి..
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇద్దరు ప్రేమించుకొని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు కూడా .. నయనతార వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా.. మరొకవైపు దర్శకుడిగా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు విఘ్నేష్ శివన్.. అంతే కాదు నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.. అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగత జీవితంలోను సంతోషంగా సాగుతోంది ఈ జంట.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అలాగే తనకు సంబంధించిన సినిమా విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు..
విఘ్నేష్ ఎమోషనల్ పోస్ట్..
ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు విఘ్నేష్ శివన్.. ప్రస్తుతం హాంకాంగ్లో ఉన్న డిస్నీల్యాండ్ కి తన భార్య నయనతార పిల్లలతో వెకేషన్ కి వెళ్ళాడు.. డిస్నీ ల్యాండ్ ఎంట్రీ వద్ద తన ఫ్యామిలీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అయితే ఈ పోస్ట్ కి తాను 12 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చానని.. చెప్పులు వేసుకుని జేబులో కేవలం 1000 రూపాయలతో పోడా పొడి షూటింగు కోసం ఇక్కడ పర్మిషన్ అడగడానికి వచ్చాను.. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భార్య పిల్లలతో ఫ్యామిలీగా వచ్చాను.. చాలా ఎమోషనల్ తో కూడిన సంతృప్తికరంగా ఉంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు విఘ్నేష్ శివన్ ..ప్రస్తుతం విఘ్నేష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
నయనతార సినిమాలు..
ఇక నయనతార విషయానికి వస్తే.. వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా ఉన్న ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా మరింతగా ఆకట్టుకుంటుంది.. ఇప్పుడు త్వరలోనే మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం ..అంతే కాదు సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది నయనతార . ప్రస్తుతం జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన ఈమె అక్కడ కూడా సత్తా చాటుతూ బాలీవుడ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది.
View this post on Instagram