Maname Movie: కృతి శెట్టి కొడుకు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

Maname Movie.. దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత యంగ్ హీరో శర్వానంద్ నటించిన చిత్రం మనమే. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిన్న ట్రైలర్ లాంచ్ చెయ్యగా.. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని.. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులలో ఒక ఆలోచన అయితే వచ్చిందని చెప్పాలి. ఇందులో అటు శర్వానంద్ కామెడీ టైమింగ్ , ఇటు కృతి శెట్టి డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. ఇకపోతే ఒక పిల్లాడి కోసం వీరిద్దరూ పోట్లాడుకోవడం ఈ ట్రైలర్ లో చూడవచ్చు.. అయితే వీరిద్దరూ ఆ పిల్లాడిని పెంచుకుంటున్నట్లు చూపించారు. ఇక చివర్లో ఎంత ప్రేమగా చూసుకున్న దగ్గరైతే అవ్వగలం కానీ సొంతం కాలేం కదా అంటూ కృతి శెట్టి చివర్లో చెప్పే డైలాగ్ .. అలాగే యూట్యూబ్లో చూసినంత ఈజీగా పిల్లలను పెంచడం సులభం కాదు.. అంటూ తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్స్ బట్టి చూస్తే బాధ్యత, ఎమోషనల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే విక్రమ్ ఆదిత్య..

Maname Movie: Shock if you know the background of Kriti Shetty's son..!
Maname Movie: Shock if you know the background of Kriti Shetty’s son..!

ఇకపోతే ట్రైలర్ చూసిన తర్వాత అందరి దృష్టి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పైనే.. మనమే సినిమాలో శర్వానంద్ , కృతి శెట్టిలతో కలిసి ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించిన ఆ బాబు పేరు విక్రమ్ ఆదిత్య.. ఈ బాలుడు ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ అందులోనూ మనమే సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కొడుకే ఈ విక్రమ్ ఆదిత్య.. మనమే సినిమాను డైరెక్టర్ చేస్తున్న శ్రీరామ్ ఆదిత్య తన కొడుకుని ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పెట్టి..ఆ బాబు చుట్టూనే ఈ కథ మొత్తం తెరకెక్కించాడు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

విక్రమ్ ఆదిత్య పై ప్రశంసలు..

ఇకపోతే విక్రమ్ ఆదిత్య గురించి పలువురు మాట్లాడుతూ.. అల్లరి చేసిన ఈ సినిమాలో అంత చిన్న వయసులోనే చాలా బాగా నటించాడు. చాలా క్యూట్ గా నటించి అందరూ మెచ్చుకునేలా చేశారు అని కామెంట్ చేస్తున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కూడా తన కొడుకు గురించి చెబుతూ గర్వపడ్డాడు.

- Advertisement -

జూన్ 7న థియేటర్లలో..

ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకాన్ని చిత్ర బృందం తెలియజేస్తోంది..

ఇద్దరి కెరియర్ ఈ సినిమా ఫలితం పైనే..

ఇకపోతే అటు శర్వానంద్ కు ఇటు కృతి శెట్టి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి .. ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో వచ్చి హ్యాట్రిక్ అందుకున్న కృతి శెట్టి… ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని సాధించలేదు .. దీంతో సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుందని.. అవకాశాలు రావనే కామెంట్స్ వినిపించాయి. అంతే కస్టడీ సినిమాలో అవకాశం వచ్చింది కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.. అందుకే ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సరే విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు శర్వానంద్ కూడా ఒకే ఒక జీవితం సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఫలితం పైన కూడా ఆయన కెరియర్ ఆధారపడి ఉంది.మరి శర్వానంద్ , కృతి శెట్టిలకు ఈ సినిమా ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు