Pushpa 2 : నయా రికార్డు క్రియేట్ చేసిన కపుల్ సాంగ్… ఎన్ని రీల్స్ చేశారో తెలుసా?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ మూవీపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన కపుల్ సాంగ్ నయా రికార్డును క్రియేట్ చేయడమే అందుకు నిదర్శనం. ఈ పాటపై రీల్స్ చేసి సోషల్ మీడియా ద్వారా పుష్ప 2 క్రేజ్ ఏంటో నిరూపిస్తున్నారు. ఇంతకీ ది కపుల్ సాంగ్ క్రియేట్ చేసిన కొత్త రికార్డు ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

ఫస్ట్ సాంగ్ ఫరవాలేదు..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ పాన్ ఇండియా సక్సెస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతోంది. అయితే చాలా రోజుల నుంచి పుష్ప 2 గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా మూవీ లవర్స్. కానీ ఈ మూవీ అనుకున్న సమయానికి విడుదల కాకుండా ఆగస్టు 15న రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. దీంతో ప్రేక్షకుల్లో నెలకొన్న ఆ నిరాశను తగ్గించి, వారిలో ఉత్సాహం పెంచడానికి నెమ్మదిగా మూవీ ప్రమోషన్స్ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగానే పుష్ప పుష్ప అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా, దానికొచ్చిన స్పందన పరవాలేదు అనిపించింది.

‘The Couple Song’ from ‘Pushpa 2’ out now! Fall in love with Allu Arjun and Rashmika Mandanna’s chemistry!

- Advertisement -

అగ్గి రవ్వలా దూసుకెళ్తున్న సెకండ్ సాంగ్

తాజాగా ది కపుల్ సాంగ్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామి అనే పాటలో అల్లు అర్జున్, రష్మిక తమ ఐకానిక్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ఈ హుక్ స్టెప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ది కపుల్ సాంగ్ అనే పాటలోని హుక్ స్టెప్స్ తో సోషల్ మీడియా ద్వారా అదరగొడుతున్నారు పలువురు మూవీ లవర్స్. ఇక తాజాగా ఈ సాంగ్ క్రియేట్ చేసిన నయా రికార్డు ఏమిటంటే ఈ పాటకి ఇన్స్టా గ్రామ్ లో లక్షకి పైగా రీల్స్ క్రియేట్ చేశారు. దీంతో ది కపుల్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది అన్న విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా వెల్లడించింది. కేవలం ఇంస్టాగ్రామ్ లోనే 100 కే ప్లస్ రీల్స్ క్రియేట్ చేశారంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. మొత్తానికి మరోసారి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మూవీ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది. అలాగే ది కపుల్ సాంగ్ లో శ్రేయ ఘోషల్ వాయిస్ కి కూడా ఫిదా అవుతున్నారు.

కాగా మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతోంది. సీక్వెల్ లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉండడం గమనార్హం. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు