Heeramandi: హీరామండి వెబ్ సిరీస్ తొలి సీజన్కు ఏ విధమైన రెస్పాన్స్ దక్కిందో మనందరం చూసాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలి తొలిసారి ఓటీటిలోకి ఎంట్రీ ఇస్తూ చేసిన వెబ్ సిరీస్ నే ఈ హీరామండి సిరీస్. సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్ కూడా వస్తుందట.
ఈ విషయాన్ని స్వయంగా సంజయ్ లీల భన్సాలియే అనౌన్స్ చేశారు. హీరామండి వెబ్ సిరీస్ చాలా గ్రాండ్గా తీశారు. దీంతో ఇలాంటి సిరీస్ మళ్లీ సాధ్యమేనా? దానికి సీక్వెల్ తీస్తారా అని చాలామంది సందేహించారు. ఇక నిజానికి సంజయ్ లీల కూడా గతంలో మాట్లాడుతూ..” ఇలాంటి వెబ్ సిరీస్ కేవలం ఒకేసారి సాధ్యమవుతుంది. ఇలాంటి సిరీస్ మళ్లీ ఎవరు తీయలేరు. నేను కూడా ” అని వెల్లడించారు.
కానీ తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో అతడే సీజన్ 2 ను కన్ఫామ్ చేశారు. ” ఈ సిరీస్ తీయాలంటే చాలా శ్రమ అవసరం. ఇది మరింత ఎక్కువ శ్రమ తీసుకుంది. ఫిబ్రవరి 2022లో గంగుబాయి రిలీజ్ అయిన తర్వాత నుంచి ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కష్టపడి పని చేశాను. ఈ సిరీస్ రెండో భాదాన్ని రూపొందించడం చాలా కష్టం. కానీ నా వంతు ప్రయత్నం చేస్తాను ” అంటూ వెల్లడించారు డైరెక్టర్. ప్రెసెంట్ సంజయ్ లీలా భన్సాలీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.