Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అవుతుంది. అయితే ప్రస్తుతం కల్కి 2898 Ad సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరికి వస్తోంది. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది కల్కి సినిమా. ఇప్పటికే ఈ సినిమాప్రమోషన్స్ భారీ ఎత్తులో చేస్తున్నారు.

ప్రభాస్ నడిపిన కారు బుజ్జి ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్ కూడా మొన్న రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించారు. నా అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ త్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా దిశాపటాని ఓ స్పెషల్ సాంగ్లో దుమ్ము లేపనుందట. ఈ బాలీవుడ్ హీరోయిన్లే కాకుండా… దేశవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో చేస్తున్నారు.


ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శోభన, యంగ్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం సినిమాతోనే మృనాల్డ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే మృనాల్డ్ ఠాకూర్ కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు