Shyamala Comments on Pawan Kalyan : ప్రముఖ నటి, యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఈమె ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన భర్త నర్సింహతో పాటు అప్పట్లో శ్యామల మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. చెప్పేవాళ్లు చాలా చెప్పుకుంటున్నారని, కానీ జరిగేది జరుగుతుంది.. మనం చూస్తాం అంటూ చెప్పుకొచ్చారు.
సర్వేలు చెబుతున్నాయి అంతే
ఇక ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. కేవలం అనేక సర్వేలు మాత్రమే కాకుండా దాదాపు వైసీపీ శ్రేణులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఆసక్తికర విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది యాంకర్ శ్యామల.
పవన్ కళ్యాణ్ సాయం చేయడం చూడలేదు
నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెబుతున్నా అక్కడికి గెలిచేది వంగా గీతా గారు. అయితే ఈ మాటలకు సదరు యాంకర్ ఆవిడ ఎనిమిది వేల ఓట్లు నుంచి పదివేల ఓట్లు తేడాలో ఓడిపోతుంది అని సర్వేలు చెబుతున్నాయి అన్నారు. దీనికి శ్యామల స్పందిస్తూ సర్వేలు చెబుతున్న మాట రిజల్ట్స్ కాదు కదా. రాజకీయాలంటే ఆవేశపడటం కాదు, ఆయాస పడటం కాదు, అరవటం కాదు. రాజకీయాలంటే సాయం చేయటం నేను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సాయం చేయడం చూడలేదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.