South Star : ఒక్క సినిమాకు 200 కోట్లు… ఇండియన్ సినిమాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే విలన్ ఎవరో తెలుసా?

South Star : భారతీయ సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ నటీనటులు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరిలో కొందరు విలక్షణమైన పాత్రలు పోషించడంలో ప్రతిభావంతులు. కొందరు నటీనటులు కొన్ని ప్రత్యేక పాత్రలు చేసి ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయ్యారు. అలాంటి వారిలో ఈ నటుడు కూడా ఒకడు. సహాయక పాత్ర, హీరోయిన్ నుంచి విలన్ దాకా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలడు. ప్రస్తుతం ఈ విలన్ ఒక్క సినిమాకే 200 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఇండియాలోనే అత్యంత భారీ రెమ్యునరేషన్ తీసుకునే విలన్ గా రికార్డును క్రియేట్  చేశాడు. ఆ విలన్ ఎవరో తెలుసుకుందాం.

కాస్ట్లీ విలన్ గా చరిత్ర

సినిమాలో ముఖ్యంగా విలన్ పాత్రపై ఎప్పుడూ ప్రత్యేక అంచనాలు ఉంటాయి. విలన్ క్యారెక్టర్ సరిగ్గా సెట్ కాకపోతే అది సినిమాపై ప్రభావం చూపుతుంది. పవర్ ఫుల్ గా కనిపించే విలన్లు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరికిసొంతంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం విలన్లే కాదు హీరోలు కూడా విలన్‌లుగా నటించడం మొదలుపెట్టారు. ఒకవైపు హీరోలుగా సత్తా చాటుతూనే విలన్ గా నెగెటివ్ షేడ్ లో అదరగొడుతున్నారు. ఈ ట్రెండ్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలా భారతీయ సినిమాలో విలన్‌గా నటించే ఓ నటుడికి ఒక్క సినిమాకు రూ.200 కోట్లు పారితోషికంగా అందుతోంది. ఇంతకీ విలన్ గా అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరు అంటే మరెవరో కాదు యష్.

Yash: The Unassuming 'Rocking Star' Of Indian Cinema | Kannada News, Times  Now

- Advertisement -

ఈ పాత్ర కోసం 200 కోట్లు

కన్నడ సూపర్ స్టార్ యష్ నితేష్ తివారీ రామాయణం మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఆయన రావణుడి పాత్రను పోషించబోతున్నాడు. రణబీర్ కపూర్, సాయి పల్లవి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రూ. 835 కోట్లు బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా తెరకెక్కుతోంది. సమాచారం ప్రకారం నిర్మాతలతో భాగస్వామిగా ఉన్న యష్ ఇందులో నటుడిగా తన రెమ్యూనరేషన్ ను తీసుకోవట్లేదు. ఈ సినిమా కోసం యష్ 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతను మరింత పెద్ద డీల్‌కి వెళ్లాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం హిట్ అయితే యష్ ఈ చిత్రం నుండి రూ. 200 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఏది ఏమైనప్పటికీ రామాయణం హిట్ అయితే గనక యష్‌ని భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌గా చేస్తుంది.

సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోవర్స్

యష్ కన్నడ నటుడు అయినప్పటికీ ఆయనకు భారతదేశం అంతటా చాలా మంది అభిమానులు ఉన్నారు. యష్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ, కేజీఎఫ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని నెక్ట్ మూవీ టాక్సిక్ ఇప్పటికే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా గురించి అప్‌డేట్‌లు రావడం లేదు. యష్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండకపోవడమే అందుకు కారణం. యష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు 12.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 180 పోస్టులు మాత్రమే చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు