AP Elections Result : ఏపీ ఎలక్షన్స్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొనగా, తాజాగా వస్తున్న రిజల్ట్స్ లో కూటమి సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే టిడిపి కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేయడంతో టీడీపీ రాజకీయ నాయకులతో పాటు జనసేన టీం కూడా ఫుల్ ఖుషి గా ఉంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏపీలో కూటమిదే ఈసారి అధికార పీఠం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొత్తానికి ఈసారి టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఇండస్ట్రీలో ఎక్కువగా హ్యాపీగా ఉండేది ఆయనే. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు అంత సంతోషం? అనే విషయంలోకి వెళ్తే…
టాలీవుడ్ వర్సెస్ ఏపీ రాజకీయాలు
వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలు వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా ఏర్పడింది పరిస్థితి. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో కీలకపాత్రను పోషించడం వల్ల అధికార పార్టీ పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ విమర్శల పాలైంది. అప్పట్లో సినిమా టికెట్ ధరలను తగ్గించి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవితో సహా సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ డైరెక్ట్ గా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రిని కలిసి టికెట్ల పెంపు గురించి చర్చించారు. అనంతరం పరిస్థితి మళ్లీ మామూలు అయినప్పటికీ టికెట్ల ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమంది టికెట్ల ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, నాని లాంటి హీరోల సినిమాలు హిట్ అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు.
ఇండస్ట్రీలో ఎక్కువ హ్యాపీగా ఉండేది ఈయనే
ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత మంది బహిరంగంగానే ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. అందులో స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఒకరు. ఈ నేపథ్యంలోనే అశ్విని దత్ నిర్మిస్తున్న భారీ మూవీ కల్కి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో చిక్కుకుంది.
అశ్విని దత్ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ మూవీ టికెట్ ప్రైజ్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి విషయాలలో కల్కి టీం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని టాక్ నడిచింది. కానీ ప్రస్తుతం టిడిపి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి కలిపి సినిమాకు అడ్డంకులని తొలగినట్టే. కాబట్టి అశ్వని దత్ హ్యాపీ.
కల్కికి బెనిఫిట్ ఏంటి?
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కల్కి మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ప్రైజ్ పెంపు కూడా కావలసినంత దొరుకుతుంది. ఒకవేళ అనుకున్నట్టుగా ఇవన్నీ పెద్దగా జరగకపోయినా కనీసం టికెట్ ప్రైజ్ అయితే తగ్గించరు కాబట్టి నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి నిర్మాత అశ్విని దత్ అంటున్నారు. అలాగే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏపీలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు.
కూటమి సునామితో ఇండస్ట్రీలో చాలా మంది హ్యాపీగా ఉండొచ్చు.
కానీ, దత్ తాత మాత్రం వేరే లెవెల్ హ్యాపీ.#APElections2024 #APElectionResults #AlluArjun #YsJagan #PawanKalyan #Pithapuram #AllianceSweepingAP #HelloAP_ByeByeYCP #Kalki2898AD #Kalki2898ADonJune27th #NarendraModi #Ayodhya pic.twitter.com/oKTwQ3Hqw3— Gajala From Washington DC (@GajalaFrmWDC) June 4, 2024