AP Election Results : వేణు స్వామి ఎక్కడ్రా? అంటున్న వాళ్లకు సమాధానం… జోస్యం తప్పింది అంటూ కామెంట్స్

AP Election Results : ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ పైనే ప్రస్తుతం అందరి కళ్ళు ఉన్నాయి. కూటమి ఊహించని విధంగా క్లీన్ స్వీట్ చేయడంతో ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి గతంలో చెప్పిన జోస్యాన్ని గుర్తు చేస్తూ అతను ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ప్రస్తుతం తనపై వస్తున్న ట్రోల్లింగ్ పై వేణు స్వామి స్పందించారు. ఆయన సమాధానం ఏమిటంటే…

తప్పిన వేణు స్వామి జోస్యం

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజకీయ వర్గాలతో పాటు సినీ సెలబ్రిటీల జ్యోతిష్యం గురించి చెప్పి పలు వివాదాలతో పాటు బాగా పాపులర్ అయిపోయారు వేణు స్వామి. అంతేకాదు ఆయనతో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ప్రత్యేక పూజలు చేయించుకుని వార్తల్లో నిలిచారు. అయితే కొంతమంది వేణు స్వామి జ్యోతిష్యాన్ని కొట్టి పారేస్తే, మరి కొంతమంది మాత్రం స్ట్రాంగ్ గా నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో జరిగిన ఎలక్షన్స్ పై ఆయన చెప్పిన జోస్యం తలకిందులైంది. వేణు స్వామి గతంలో ఏపీలో ఈసారి కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని, కేంద్రంలో మోడీ ప్రభావం తగ్గుతుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఆయన చెప్పింది దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుండడంతో ట్రోలర్స్ వేణు స్వామి ఎక్కడరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆయనపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Venu Swamy : ఏపీలో కూట‌మి హ‌వా.. వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. | Astrologer venu swamy reacts over ap elections results 2024-10TV Telugu

- Advertisement -

వేణు స్వామి సమాధానం

ఈ నేపథ్యంలోనే వేణు స్వామి తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై, అలాగే తన జోస్యం తప్పు అవ్వడంపై స్పందించారు. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్స్ పై, అలాగే ఏపీ ఎలక్షన్స్ పై నేను చెప్పిన జోస్యం తప్పింది అంటూ ఒప్పుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభావం తగ్గుతుందని, ఏపీలో మరోసారి వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుందని చెప్పాను అని గుర్తు చేస్తూ జ్యోతిష్యం ప్రకారం నా విజ్ఞానాన్ని అనుసరిస్తూనే జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్తాను. అయితే నేను చెప్పిన దాంట్లో కేంద్రంలో మోడీ ఓడిపోతాడని, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పిన రెండు విషయాలు తప్పు అయ్యాయి. ఈరోజు నేను చెప్పిన జోసెఫ్ 100% తప్పయింది. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పటిదాకా ఎంతో మంది నన్ను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేశారు. ఇందులో నాకు సహకరించి, నాతో ఉన్నవాళ్లకు థాంక్యు అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.

సినీ ప్రముఖుల సంబరాలు

ఇక పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్ తదితరులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు