Chiranjeevi: గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టండి.. చిరంజీవి కామెంట్స్ వైరల్..!

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటికే ఏపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది తెలుగుదేశం కూటమి. అధికారం చేపట్టేందుకు 88 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం. అయితే తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కలిపి.. ఇప్పటికే 124 స్థానాలలో విజయం సాధించింది.

ఇందులో తెలుగుదేశం పార్టీ 100 సీట్లు ఎప్పుడో దాటేసింది. అటు జనసేన పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించేలా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా ఈ పార్టీలు మరికొన్ని స్థానాలలో లీడింగ్ లో ఉన్నాయి.

- Advertisement -

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో… చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.

‘ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే గర్వంగా వుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నవ్వు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు