Manamey pre release event: శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న తాజా మూవీ మనమే. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలేషన్షిప్ కామెడీ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ మూవీ జూన్ ఏడవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీం రెడీ అయింది. ఈ ఈవెంట్ డేట్ అండ్ వేదికను ప్రకటించింది. మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనగా జూన్ 5వ తారీకు సాయంత్రం 6 నుంచి హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఇక ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేడు అధికారికంగా ప్రకటించింది.
Get ready for the Grandest Pre-Release Event Celebrations of #Manamey 🤩
🕕 June 5th, from 6 PM Onwards. 🥳
📍 Park Hyatt, Hyderabad. @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @HeshamAWMusic @IamSeeratKapoor #AyeshaKhan @Thrigun_Aactor @iam_shiva9696… pic.twitter.com/ExVsYjaX1U
— People Media Factory (@peoplemediafcy) June 4, 2024
శర్వా అండ్ కృతి ఉన్న కలర్ ఫుల్ పోస్టర్తో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలను మూవీ టీం వెల్లడించింది. ” మనమే ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండి. జూన్ 5 సాయంత్రం 6 నుంచి పార్క్ హయత్ లో జరుగుతుంది ” అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రజెంట్ ఈట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.