Kangana Ranaut: 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి నేడు ఎంపీగా.. కంగనా ప్రస్థానం సుస్థిరం..!

Kangana Ranaut.. చాలామంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలో తమకు క్రేజ్ వచ్చిన తర్వాత పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తూ మంచి సక్సెస్ ని అందుకున్న వారు చాలామంది ఉన్నారు.. అలాంటివారు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఈసారి 2024 లోక్సభ ఎన్నికలలో విజయం సాధించి.. మరోసారి తనని తాను నిరూపించుకున్న హీరోయిన్ కంగానా రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈసారి లోక్సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈమె బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకుంది.. ఇలాంటి సమయంలో కంగానా రనౌత్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం.

15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయిన కంగనా..

Kangana Ranaut: ran away from home at the age of 15 and became an MP today.. Kangana's reign is stable..
Kangana Ranaut: ran away from home at the age of 15 and became an MP today.. Kangana’s reign is stable..

కంగానా రనౌత్ సినిమాలలో నటించడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది.. ఈమె హీరోయిన్ గా ఎదగడం కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చానని ముఖ్యంగా చదువు కూడా మధ్యలోనే ఆపేసి వచ్చానని.. 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి మరీ బయటికి రావడంతో ఆ సమయంలో తనకు ఉండడానికి సరైన ప్లాట్ఫారం లేదని చెప్పుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ గా పేరు సంపాదించింది కంగానా రనౌత్.. ఈ ముద్దుగుమ్మ హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాలో బాంబియా అనే పట్టణంలో జన్మించింది..

రాజుల కుటుంబానికి చెందిన బ్యూటీ..

కంగానా రనౌత్ కుటుంబం కూడా రాజుల కుటుంబానికి చెందినది.. ఈమె తల్లి ఒక ఉపాధ్యాయురాలు, తండ్రి ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు.కంగానా రనౌత్ కు ఒక తమ్ముడు, అక్క కూడా ఉన్నారు.. ఈమెకు చిన్న వయసు నుంచి సినిమాలలో నటించాలని చాలా కోరిక ఉండేదట. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఈ విషయం పైన ఆమెను ప్రతిసారి తిట్టేవారట. అలా 15 ఏళ్ల వయసులోనే ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి ముంబైకి పారిపోయింది. అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులను , కష్టాలను కూడా అనుభవించిందట కంగానా రనౌత్.

- Advertisement -

నాడు కష్టాలు.. నేడు లేడీ క్వీన్..

అలా ఎన్నో కష్టాలను అధిగమించిన తర్వాత సరిగ్గా తనకు 19 ఏళ్ల వయసు వచ్చేసరికి సినిమాలలో నటించే అవకాశం లభించిందని.. అనురాగ్ డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్ స్టర్ సినిమాతో తాను ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. ఆ వెంటనే ఫ్యాషన్ సినిమాతో బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. తను నటించిన తనూ వెడ్స్ అనే చిత్రంతో ఇండియాలోనే రూ .100 కోట్లు సాధించిన మొట్టమొదటి తొలి హీరోయిన్ గా నిలిచింది. అలా నెమ్మదిగా బాలీవుడ్ లో లేడీ క్వీన్ గా కూడా పేరు సంపాదించింది.

ఎంపీగా అఖండ విజయం..

ప్రస్తుతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్ నిరంతరం ఏదో ఒక విషయం పైన వార్తలలో నిలుస్తూనే ఉంది.. నటిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె డైరెక్షన్లో ఎమర్జెన్సీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఈ సినిమాలో ఈమె ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది నిర్మాతగా కూడా ఈమె వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీ చేసి ఎంపీ గా గెలిచింది. ఇక ఈ విజయకేతనం కంగనా రనౌత్ ఇంట్లో సంబరాలను తెచ్చిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు