Tollywood: టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ లకు వెహికల్స్ ను నిలిపివేసింది వెహికల్ ఓనర్స్ అసోసియేషన్. తమ వేతనాలు, వెహికల్ రెంట్లు పెంచేంత వరకు వెహికల్స్ బంద్ చేస్తామని తెలిపారు తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్. ఈ నిరసన నేపథ్యంలో వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనీఫ్ మాట్లాడారు.
గతంలో నిర్మాతల మండలికి తమ సమస్యలను విన్నవించినా సమస్యలు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనీఫ్ వెల్లడించారు. ఈ రోజు లేదా రేపు నిర్మాతల మండలితో చర్చలు ఉండబోతున్నట్లు వెల్లడించారు. 16 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నామన్నారు ప్రెసిడెంట్ హనీఫ్. దాదాపు 900 వెహికల్స్ అసోసియేషన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
అసోసియేషన్ లో 1200 మంది ఓనర్స్ సభ్యులుగా ఉన్నారని వివరించారు. వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అటు చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… తమ వేతనాలు, వెహికల్ రెంట్లు పెంచేంత వరకు వెహికల్స్ బంద్ చేస్తామని ప్రకటించారు. ఎన్నిసార్లు అడిగినా..తమ డిమాండ్స్ నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు. అయితే.. వెహికల్ ఓనర్స్ సమ్మెకు దిగితే.. సినిమా షూటింగ్ లు ఆగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు సినీ ప్రముఖులు. మరి ఈ విషయంపై నిర్మాతల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.