Aarthi Agarwal death anniversary.. ఆర్తి అగర్వాల్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో అడుగుపెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకొని కెరియర్ పరంగా తారాజువ్వలా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ .. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలు అందరితో కూడా జతకట్టి మెప్పించింది..ఈమె కెరియర్ రివ్వున దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా గ్రాఫ్ కింద పడిపోయింది.. అప్పటి నుంచి మళ్ళీ కోలుకోలేక పోయింది ఆర్తి అగర్వాల్.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక , ప్రేమ విఫలం కావడం… పైగా వైద్య చికిత్స వికటించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది ఆర్తి అగర్వాల్.. ఇక ఈరోజు ఆమె వర్ధంతి ..ఈ సందర్భంగా ఆమె ఎన్నో అవమానాలను, ఇబ్బందులను తన జీవితంలో ఎదుర్కొంది.. వాటి గురించి ఒకసారి చూద్దాం.
అలా ఇండస్ట్రీకి పయనం..
అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో మార్చి 5వ తేదీన నందినిగా జన్మించింది అగర్వాల్.. ఈమె తండ్రి శశాంక్ వ్యాపారవేత్త.. తల్లి వీమా గృహిణి.. అయితే ఒకసారి అమెరికాలో సునీల్ శెట్టి పర్యటించిన సమయంలో ఆర్తి అగర్వాల్ ను వేదికపైకి పిలిచి డాన్స్ చేయించడంతో ఆమెలో నటి కావాలననే కోరిక కలిగిందట.. ఇక దానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఆమె కల సహకారం అయింది. ఇక అలా పాగల్ పన్ చిత్రంతో కెరియర్ మొదలు పెట్టిన ఈమె… నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను , అల్లరి రాముడు , ఇంద్ర, నీ స్నేహం, బాబి, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి సినిమాలలో నటించింది… ఈ సినిమాలన్నీ కూడా అగ్ర హీరోలతోనే నటించడం గమనార్హం.
హీరోతో ఎఫైర్.. పెళ్లయిన రెండేళ్లకే బ్రేకప్..
ఇకపోతే నాగార్జున, ప్రభాస్ , రవితేజ లతో వరుసగా సినిమాలలో నటిస్తుండగానే.. హీరో తరుణ్ తో ఈమె ప్రేమలో పడింది.. పీకల్లోతు వ్యవహారంలో మునిగితేలారనే వార్త మీడియాలో వచ్చింది .. అయితే చివరికి వారిద్దరి ఎఫైర్ బ్రేకప్ కావడంతో ఈమె మనస్థాపానికి గురైందని.. ఆ సమయంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుందని వార్తలు వినిపించాయి.. ఇక ఇలాంటి సంఘటనల మధ్య తిరిగి అమెరికా వెళ్లిపోయిన ఆర్తి అగర్వాల్..2007లో తండ్రి కోరిక మేరకు తస్వాల్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుంది.. అయితే అతడితో కూడా ఎక్కువకాలం గడపలేదు.. అభిప్రాయ భేదాలు రావడంతో 2009లోనే వారిద్దరు విడిపోయారు.
తండ్రే కాల యముడు..
దీంతో పూర్తిగా బరువు పెరిగి పోయిన ఆర్తి అగర్వాల్ ను తన తండ్రి మళ్ళీ సినిమాలలో నటించాలని కండిషన్ పెట్టారట.. నటించనని చెప్పినా సరే ఆమెను చిత్రవధకు గురి చేశారని.. అప్పట్లో వార్తలు వినిపించాయి.. ఇక బరువు తగ్గడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసిందట.. ఇక తండ్రి పెట్టే బాధను భరించలేక చివరికి బరువు తగ్గించుకోవడానికి లైఫో సక్షన్ సర్జరీని చేయించుకుంది.. ఇక ఆరు వారాల తర్వాత ఈ లైఫో సక్షన్ సర్జరీ వికటించింది. దాంతో శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో 2015 జూన్ 6వ తేదీన స్వర్గస్తులయ్యింది.. ఇక అలా జీవితంలో ఎన్నో నరకాలను చూసిన ఈమె.. ఇప్పుడు మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఇకపోతే చివరిగా ఈమె నటించిన ‘ఆమె ఎవరు ‘అనే సినిమా ఈమె మరణం తర్వాత విడుదలైంది.