Happy Birthday: ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ చిన్న పిల్లాడు ఇప్పుడు ఒక స్టార్ హీరో. ఫుల్ స్మైల్ ఇచ్చి ఫోటోకి ఫోజులిచ్చిన ఆ చిన్నోడికి ఇప్పుడు 41 ఏళ్లు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ నటుడు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వరుస హిట్లు కొడుతూ హాట్ టాపిక్ అవుతున్నాడు. సింపుల్ సినిమాలతోనే సూపర్ స్టార్ గా మెరుస్తున్నాడు. అంతేకాదు ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది. ఆ తరువాతే నటుడిగా మరింత ఎదిగాడు. మరి ఈ చిన్నోడు ఎవరో గుర్తు పట్టారా?
ఆ హీరో ఎవరంటే?
ఇంకా ఆ చిన్నోడు ఎవరో గుర్తు పట్టకపోతే ఏఎ సస్పెన్స్ కి ఇక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం . ఆ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి మరెవరో కాదు కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి. అవును ఆ చిన్నోడి ఫోటోను తదేకంగా గమనిస్తే, ఇప్పుడు రక్షిత్ శెట్టి ముఖాన్ని చూసినా అదే చిరునవ్వు కనిపిస్తుంది. ఈ రోజు రక్షిత్ శెట్టి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన నటుడు రక్షిత్ శెట్టి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
చార్లీ 777తో పాన్ ఇండియా గుర్తింపు
రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 చిత్రం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత సప్త సాగరాయలు దాటి సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా, అవి కేవలం కన్నడ పరిశ్రమ దాకానే పరిమితం అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలు రక్షిత్ శెట్టి పాపులారిటీని దేశవ్యాప్తంగా పెరిగేలా చేశాయి.
రక్షిత్ శెట్టి కెరీర్లో కిరిక్ పార్టీ, అవనే శ్రీమన్నారాయణ, 777 చార్లీ, సప్త సాగరాలు దాటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. సప్త సాగరాలు దాటి సినిమాలు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అవయిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ
రక్షిత్ శెట్టి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకు 135 పోస్ట్లను పోస్ట్ చేశారు. కానీ ఆయనకు మాత్రం 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో 205 మందిని ఫాలో అవుతున్నారు.
రష్మికతో నిశ్చితార్థం
అప్పట్లో రష్మిక మందన్నతో రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో ఈ నిశ్చితార్థం ఆగిపోయింది. వీరిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకున్నప్పటికీ ఎంగేజ్మెంట్ దగ్గరే ఆగిపోయింది. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఫలితంగా రష్మికపై రక్షిత్ అభిమానులు మండిపడ్డారు. కానీ రష్మిక మాత్రం అవేమీ పట్టించుకోకుండా టాలీవుడ్ కు వచ్చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు రక్షిత్ శెట్టి కూడా అప్పట్లోనే ఆ ఘటనను మర్చిపోయి సినిమాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం ఈ నటుడు ఒంటరిగా ఉన్నాడు. పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాడు.