Bollywood : మోసం చేశాడు… నిర్మాతను పోలీస్ స్టేషన్ కీడ్చిన నటి

Bollywood : మోసం చేశాడు అంటూ ఓ నిర్మాతను పోలీస్ స్టేషన్ కు ఈడ్చింది ఓ నటి. ఇదివరకు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో కానీ, ఇప్పుడు మాత్రం తమ విషయంలో ఎలాంటి మోసం జరిగినా అస్సలు సహించట్లేదు నటీనటులు. డైరెక్ట్ గా న్యాయ పోరాటానికే సిద్ధం అవుతున్నారు. రీసెంట్ గా ఓ మలయాళ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు అంటూ ఓ నటి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటనను మారిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు డిఫరెంట్.

నిర్మాతపై నటి కేసు

హిందీ టీవీ స్టార్ మీరా దోస్తలే తాను పని చేసిన సీరియల్ నిర్మాతపై కేసు పెట్టింది. 2019లో తాను పని చేసిన ‘విద్య’ సీరియల్ నిర్మాత మహేష్ పాండేపై మీరా ఫిర్యాదు చేసింది. అతను తన పనికి పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని, తనను మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

అసలు వివాదం ఇదే

మీరా గతంలో ‘విద్య’ అనే సీరియల్‌లో నటించింది. ఆమె రెమ్యూనరేషన్ 8 లక్షల రూపాయలు. కానీ నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చిన నిర్మాత మహేష్ పాండే మిగతా రెమ్యూనరేషన్ ను చెల్లించలేదు. బాకీ అడిగితే సాకులు చెప్పాడట. అంతేకాదు డబ్బులు అడుగుతోంది అనే కారణంతో ఆమె కాల్స్ తీయడం కూడా మానేశాడట. అందుకే పోలీస్ స్టేషన్‌కి వెళ్లానని మీరా చెప్పింది.Namish Taneja-Meera Desothale's Vidya Goes Off-Air, While Actors Say They Expected This Move, Producer Mahesh Pandey Is 'Shocked' (View Posts)) | 📺 LatestLY

- Advertisement -

మీరా మాట్లాడుతూ నాలుగు లక్షల రూపాయలు కొంతమందికి చిన్నవిగా అనిపించవచ్చు. కానీ నా కుటుంబాన్ని నెనే పోషిస్తాను. కాబట్టి నకు నాలుగు లక్షల రూపాయలు పెద్ద మొత్తం. అలాగే నేను కష్టపడి సంపాదించిన డబ్బును అడగడంలో తప్పు ఏముంది? అందుకే నిర్మాతపై ఫిర్యాదు చేశాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

నిర్మాత రియాక్షన్

నటి ఫిర్యాదుపై నిర్మాత మహేష్ పాండే స్పందిస్తూ.. ‘విద్య’ సీరియల్ వల్ల నాకు నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. నటి మీరాకు జీఎస్టీతో కలిపి 83 లక్షల రూపాయలు చెల్లించాను. దాని గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదు. నేను కేవలం మూడు లక్షల రూపాయలు చెల్లించాలి. నష్టం కారణంగా నేను ఆ మిగతా డబ్బులు ఇవ్వలేకపోయాను. ‘విద్య’ షో సగంలోనే ఆగిపోయింది. దాని గురించి ఆమె మాటాడలేదు. నేను ఆమెను మోసం చేయాలనుకున్నట్లయితే కేవలం 3 లక్షలు చెల్లించి నిశ్శబ్దంగా ఉండేవాడిని. ఆమెకు భారీ మొత్తం ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను బాకీ చెల్లించాలని అనుకుంటున్నాను. ఆమె బకాయిలన్నీ లెక్కించి బాకీ చెల్లిస్తాను అని అన్నాడు.

మీరా ఎవరు?

నటి మీరా కొన్ని హిందీ సీరియల్స్, రియాల్టీ షోలలో పాల్గొంది. ‘విద్య’ సీరియల్ 2019లో ప్రారంభమై కొన్ని నెలల తర్వాత అంటే 2020లో పూర్తి అయ్యింది. ఆ తర్వాత ‘కుచ్ రీత్ జగత్ కి ఐక్ హో’ సీరియల్‌లో నందిని పాత్రను మీరా పోషించింది. ప్రస్తుతం మీరా మరికొన్ని సీరియల్స్‌లో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు