Kalki 2898AD : కర్ణాటక గడ్డపై భారీ బిజినెస్..!

Kalki 2898AD: మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898AD.. త్వరలో ఈ సినిమా సెన్సార్ కి కూడా వెళ్లనుంది… దాదాపు మూడు గంటల పాటు ఈ సినిమా నిడివి ఉండనున్నట్టు తెలుస్తోంది.. మరొకవైపు ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా కర్ణాటక బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం.. అక్కడ ఏకంగా 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

కల్కి మూవీ కి భారీ బిజినెస్..

Kalki 2898AD : Huge business on Karnataka soil..!
Kalki 2898AD : Huge business on Karnataka soil..!

ఒక కర్ణాటక ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా ఇదే రేంజ్ లో రికార్డు బిజినెస్ జరిగినట్టు సమాచారం.. ఈ సినిమాలో కమలహాసన్ నటించగా.. అక్కడ కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. దాదాపుగా ఈ సినిమా రూ.20 కోట్ల వరకు అక్కడ బిజినెస్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏకంగా రూ.160 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.. ఇక ఇవే కాకుండా అటు హిందీ , రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపు రూ.100 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కి ముందే రూ. 340 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

900 రోజుల కేటాయింపు..

భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం సహజమే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 900 రోజులు డేట్స్ కేటాయించిన విషయం తెలిసిందే.. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాతో దీపికా పదుకొనే మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు.

- Advertisement -

స్టార్స్ కూడా హైప్ పెంచేసారుగా..

మరొకవైపు బిగ్ బీ , కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాపై భారీ హైప్ కూడా నెలకొంది. గత ఏడాది ఆది పురుష్ సినిమాతో అట్టర్ ప్లాప్ చవిచూసిన ప్రభాస్.. సలార్ సినిమాతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యారని చెప్పాలి.. ఇప్పుడు సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్ -2 శౌర్యంగ పర్వం అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్.. ఆగస్టు వరకు ఈ సినిమా కంప్లీట్ అవుతుంది.. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఇతర పనుల కారణంగా ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.. మరొకవైపు ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సినిమా టికెట్స్ రేట్స్ పెంపుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే టికెట్లు రేట్లు పెంచి బాగా దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు.. మరి నిర్మాతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు