Saranya Mohan: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాని హీరోయిన్.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా..!

Saranya Mohan.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అనుకోకుండా గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న శరణ్య నాగ్ కూడా మరింత బరువు పెరిగిపోయి అందర్నీ ఆశ్చర్యపరచగా …తాజాగా మరో హీరోయిన్ ఇప్పుడు అభిమానులను షాక్ కి గురిచేస్తోంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్స్ లో చాలా మార్పులు వస్తాయి.. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక ముద్దుగుమ్మలో మాత్రం ఎటువంటి మార్పులు కనిపించకపోవడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు…

భీమిలి కబడ్డీ జట్టు బ్యూటీ…

కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు హీరో నాని.. అలాంటి నాని కెరియర్ లో మంచి సినిమాగా నిలిచిన మూవీ భీమిలి కబడ్డీ జట్టు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోకపోయినా… నాని తన నటనతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించారనే చెప్పాలి.. తాతినేని సత్యా దర్శకత్వంలో వచ్చిన ఈ భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2017లో విడుదలై ఇప్పటికీ ఎవర్గ్రీన్ గానే నిలిచింది.. సినిమా సక్సెస్ కాకపోతే నేమి ఇందులో నటించిన నటీనటులకు మాత్రం మంచి గుర్తింపు లభించింది ఇందులో పల్లెటూరి కుర్రాడిగా నాని కనిపించాడు. తమిళ చిత్రమైన వెన్నిళ కబడీ కుళు సినిమాకు రీమేక్.. ఈ సినిమాలో నానికి జోడిగా శరణ్య మోహన్ నటించింది.. ఈ ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా అనిపించిందని చెప్పవచ్చు..

ఆశ్చర్యపరుస్తున్న శరణ్య మోహన్..

శరణ్య మోహన్ చేసింది తక్కువ సినిమాలే అయినా నటనతో అందంతో అటు తెలుగు ఇటు తమిళ్, మలయాళం ప్రేక్షకులను కూడా అలరించింది. అంతేకాదు కన్నడ , హిందీ సినిమాలలో కూడా నటించింది. తెలుగులో కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శరణ్య మోహన్ ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ నటించిన కత్తి సినిమాలో కూడా నటించింది.. అయితే కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో ఆయనకు చెల్లెలుగా అలరించింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే తెలుగులో ఇదే సినిమా ఈమెకు చివరి కావడం గమనార్హం.

- Advertisement -

పెళ్లి తర్వాత కూడా అదే అందం..

Saranya Mohan: Nani heroine who has changed beyond recognition.. then like this now like this..!
Saranya Mohan: Nani heroine who has changed beyond recognition.. then like this now like this..!

ఇక తర్వాత ఇండస్ట్రీకి దూరమై తన చిన్ననాటి స్నేహితుడు, వైద్యుడు అయిన అరవింద్ కృష్ణ ను 2015లో వివాహం చేసుకుంది .. ప్రస్తుతం ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శరణ్య మోహన్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాల్లో క్యూట్ గా కనిపించిన శరణ్య ఇప్పటికీ కూడా అలాగే ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. తాజాగా ఈ క్యూట్ లేడీ ప్రేక్షకులతో పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ..శరణ్యమోహన్ లో అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . పెళ్లి అయ్యాక కూడా అంతే గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా అంతే అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కూతురు కూడా ఈమెకు జిరాక్స్ కాపీ అంటున్నారు ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Aravind Krishnan (@swami_bro)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు