Anasuya: ఇది ఆరంభం మాత్రమే.. పవన్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్..!

Anasuya.. ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ యాంకర్ అనసూయ ఎప్పటికీ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఎక్కువగా తాను నటించే సినిమాలు, చేసే షోలపై ఫోకస్ చేస్తూ ఉంటుంది.. అందుకేనేమో బహుశా రాజకీయాలకు దూరంగా ఉంటుంది అనసూయ.. అనసూయ ఈ ఎన్నికలలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..

పుష్ప -2 లో అనసూయ..

జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ.. తన నటనతో అందరిని అలరిస్తోంది. గతంలో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.. అనూహ్యంగా టెలివిజన్ కి దూరమైంది.. ఇక సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమాలో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా పేరు దక్కించుకోనుంది..

పాలిటిక్స్ పై మొదటి సారి స్పందించిన అనసూయ..

Anasuya: This is just the beginning.. Anasuya's shocking comments on Pawan..!
Anasuya: This is just the beginning.. Anasuya’s shocking comments on Pawan..!

ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాదు తన కుటుంబ విషయాలు, సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.. కానీ రాజకీయాల గురించి స్పందించడం చాలా అరుదు.. కానీ మహిళలకు సంబంధించిన విషయాలలో అలాగే తన పై ట్రోలింగ్ జరిగితే మాత్రం ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తూ బిజీగా కనిపించారు.. అయితే అనసూయ మాత్రం పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ గడిపింది.. మరొకవైపు యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతు ఇస్తూ… ఎన్నికల ప్రచారం కూడా చేసింది.. పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలు కూడా చేసింది శ్యామల.. అయితే అనసూయ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంది.. కానీ ఏమైందో తెలియదు సడన్ గా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..

- Advertisement -

మెగా సంబరాలు..

పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు.. గురువారం రోజు పవన్ కళ్యాణ్ సతీసమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్ళగా… అక్కడ మెగా కుటుంబ సభ్యులు.. చిరంజీవి, సురేఖ, అంజనాదేవి , నాగబాబు, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి,పవన్ అక్కచెల్లెళ్లు, నిహారిక తదితరులు పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికారు.. మంగళహారతులు పట్టారు.. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి , సురేఖ, తన తల్లి అంజనా దేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ దృశ్యాలను చూసి మెగా బ్రదర్ నాగబాబు కూడా కంటతడి పెట్టుకున్నారు ..ఇక మెగా అభిమాని ఎమోషనల్ అయ్యేలా అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు వెళ్లి విరిసాయి..

ఇది ఆరంభం మాత్రమే అంటున్న అనసూయ..

దీనిపై అనసూయ పోస్ట్ చేస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నాయకుడు వచ్చాడు.. పవర్ లో పవర్ స్టార్ అంటూ అనసూయ పోస్ట్ చేసింది.. ఇది నిజమైన ప్రేమ అంటూ చిరంజీవి – పవన్ మధ్య అనుబంధం గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు