RIP Ramoji Rao : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇకలేరు

RIP Ramoji Rao : తెలుగు మీడియాలో ఒక సంచలనం సృష్టించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామోజీ ఫిలిం సిటీని ఆయన నిర్మించారు. అలానే ఉషా కిరణ్ మూవీస్ సంస్థ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు అలానే వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్రవేశారు.

తెలుగు సినిమాలో తన రచనలకు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ , ఐదు నంది అవార్డులు మరియు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందాడు . జర్నలిజం, సాహిత్యం మరియు విద్యలో ఆయన చేసిన సేవలకు గానూ, భారతదేశం యొక్క రెండవ-అత్యున్నత పౌర గౌరవమైన పద్మ విభూషణ్‌తో సత్కరించారు .

Ramoji Rao

- Advertisement -

ఈనాడు సంస్థల చైర్మన్‌ “రామోజీ రావు” అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుండి ఆయన నీరసంగానే ఉండగా, రామోజీరావు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని రామోజీ రావును ఇంటి నుండి నానక్ రామ్ గూడ లో ఓ ఆస్పత్రి కి తరలించారు. అస్వస్థతకు (RamojiRao Hospitalised) గురయిన రామోజీరావు వెంటిలేటర్ మీద వైద్యం తీసుకుంటూ, నేడు ( 8 జూన్ 2024 ) తెల్లవారుజామున రామోజీ రావు మరణించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు