Jyothi Purvaj: డైరెక్టర్ తో వివాహం అయిపోయిందంటూ జ్యోతి కామెంట్స్..!

Jyothi Purvaj: ఈ మధ్యకాలంలో చాలామంది వివాహాలు చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్న విషయం తెలిసిందే . మరి కొంతమంది ఆల్రెడీ వివాహం అయిన తర్వాత విభేదాలు రావడంతో కట్టుకున్న వారికి బ్రేకప్ చెప్పి ఇంకొకరితో ప్రేమలో పడి వారిని కూడా వివాహం చేసుకుంటున్నారు.. ఇక ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకొని.. అభిమానులతో పెళ్లి చేసుకున్నాను అంటూ నేరుగా సోషల్ మీడియాలో ప్రకటించింది ప్రముఖ బుల్లితెర నటి జ్యోతి పూర్వాజ్.. శుక్ర , మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీ ల తర్వాత దర్శకుడు సుకు పూర్వాజ్ తాజాగా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఏ మాస్టర్ పీస్ అనే సినిమాతో డైరెక్టర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు..

ఏ మాస్టర్ పీస్..

ఇందులో మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు ప్రతిష్టాత్మక ఫిలిం ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.. మైథాలజీ , సైన్స్ ఫిక్షన్ కలిపిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్పీరియన్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నామంటూ టీం చెబుతోంది. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఏ మాస్టర్ పీస్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

డైరెక్టర్ సుకూ పూర్వాజ్ పెళ్లి..

Jyothi Purvaj: Jyothi comments that she is married to the director..!
Jyothi Purvaj: Jyothi comments that she is married to the director..!

టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ.. సీరియల్ ద్వారా నేను మీకు పరిచయమయ్యాను కదా.. ఏ మాస్టర్ పీస్ సినిమాతో నటిగా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతున్నాను.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా పర్సనల్ లైఫ్ కూడా ఒక టౌన్ తీసుకుంది.. సుకూ తో నా మ్యారేజ్ జరిగింది.. అప్పటి నుంచి టాలీవుడ్ నా మెట్టి నిల్లు అయిపోయింది.. ఇక ఏ మాస్టర్ పీస్ సినిమా టీజర్ కూడా మీరు చూశారు.. మీకు నచ్చిందనే నేను ఆశిస్తున్నాను.. దర్శకుడు సుకూ నా మూవీలో నా క్యారెక్టర్ గురించి కూడా చెప్పారు.. ఈ చిత్ర బృందం మొత్తం నాకు ఫ్యామిలీగా మారిపోయారు.. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను అంటూ తెలిపింది జ్యోతి పూర్వాజ్..

- Advertisement -

తెలుగింటి కోడలుగా మారిన జ్యోతి..

ఇక ఈమె కన్నడ నటి అని అందరికీ తెలిసిందే.. తెలుగులో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు అనే సీరియల్ లో రిషి అనే క్యారెక్టర్ కి తల్లి పాత్రలోనూ అలాగే సాయికిరణ్ కి భార్య పాత్రలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక అలా పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈమెకు ఇంతకు ముందే ఒక వివాహం జరిగిన విషయం తెలిసిందే.. చిన్నపాటి విభేదాలు రావడం వల్ల బ్రేకప్ కూడా అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇక ఇప్పుడు డైరెక్టర్ నే వివాహం చేసుకొని తెలుగింటి కోడలు అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు