Jayasudha.. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.. హీరోయిన్ గానే కాకుండా ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా అలరిస్తోంది.. ఇదిలా ఉండగా జయసుధ హిందూ మతస్తురాలైనప్పటికీ.. ఆ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాన్ని ఆలింగనం చేసుకోవడానికి గల కారణం ఇప్పటికి చాలా మందికి తెలియదనే చెప్పాలి.. కానీ తాజాగా ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
నేను మతం మారడానికి ఆ సంఘటనే ప్రధానం..
1985లో నితిన్ కపూర్ ను వివాహం చేసుకున్న జయసుధ.. థాయిలాండ్ కి హనీమూన్ కి వెళ్ళగా.. ఆ సమయంలో అక్కడ జరిగిన ఒక సంఘటన ఆమెను మతం మారేలా ప్రేరేపించిందని జయసుధ వెల్లడించింది. ఈ విషయంపై జయసుధ మాట్లాడుతూ.. నేను బ్యాంకాక్ లోని ఒక రిసార్ట్ కి నా భర్తతో కలిసి వెళ్లాను.. నాకు నీళ్లు అంటే భయం . ఈత రాదు.. అందుకే ఎప్పుడు సముద్రానికి దూరంగా ఉండేందుకే నేను ప్రయత్నిస్తాను.. కానీ అది బీచ్ రిసార్ట్.. నా భర్త నన్ను నీళ్లలో ఆడుకోమని బలవంతం చేశాడు.. కాపలా ఉంటానని బ్రతిమలాడాడు.. కానీ నాకు నీటిలో ఆడడం ఇష్టం లేదు.. నేను ఆటలో పాల్గొనడానికి కూడా ఇష్టపడలేదు.. కానీ నా భర్త అన్ని రైడ్ లను ఆస్వాదించాడు.. హనీమూన్ చివరి రోజున నా భర్త.. తనతో కనీసం ఒక్క సముద్ర కార్యకలాపం లోనైన పాల్గొనమని అభ్యర్థించాడు… ఇక నేను నీతోనే ఉంటానని మాట ఇచ్చాడు.. భయపడవద్దని .. అంతా సవ్యంగానే సాగుతుందని చెప్పి భరోసా ఇచ్చారు.. ఇక మా హనీమూన్ కావడం .. పైగా నా భర్తను ఎందుకు నిరాశపరచాలని అనిపించి.. వారితో కలిసి జెట్ స్కీయింగ్ కి వెళ్ళాను. నేను కళ్ళు మూసుకున్నాను.. కొన్ని నిమిషాల పాటు సముద్రం కూడా ప్రశాంతంగా ఉంది.. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అంతా మారిపోయింది.. బ్యాలెన్స్ తప్పి సముద్రంలో పడిపోయాను.. ఇక నాకేమో ఈత రాదు.. ఇక నా జీవితం అయిపోయిందనుకున్నాను.. నీళ్లలో పడ్డాక చచ్చిపోతున్నాను అనిపించింది. హిందువునైన నేను నా దేవుళ్ళని పిలిచి ఏడ్చి ఉండాల్సింది.. కానీ నేను ఏసుక్రీస్తు అని పిలిచాను.. ఇక అప్పుడు నేను మునిగిపోవడం ప్రారంభం అవ్వగా.. నేను నా శ్వాసను పట్టుకొని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాను.. ఇక కళ్ళు తెరవగానే సముద్రపు పాచి, సూర్యకిరణాలు ఎడమ కుడి వైపున నెమ్మదిగా ప్రవహించడం చూసి సూర్యకిరణాలు వెనుక ఏసు ఉన్నట్లు అనిపించింది.. ఇక అంతే నేను వేరే మతంలోకి మారడానికి ఈ ఘటనే కారణం అంటూ చెప్పుకొచ్చింది జయసుధ.. మొత్తానికైతే ఈ ఒక సందర్భం వల్ల ఆమె మతాన్ని కూడా మార్చుకుంది.
జయసుధ వైవాహిక జీవితం..
ఇకపోతే జయసుధ కాకర్ల పూడి కి చెందిన వ్యాపారవేత్త అయిన రాజేంద్రప్రసాద్ తో గతంలో వివాహం జరగగా.. విభేదాలు వచ్చి విడిపోయింది.. ఆ తర్వాత బాలీవుడ్ కి చెందిన జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది. రెండో భర్త కూడా 2017లో మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జయసుధ.