Pawan Kalyan: వ్యాపారవేత్త రామోజీరావు అనారోగ్య సమస్యలతో నేడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతోమంది నటీనటులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మృతి తనను తీవ్ర బాధకి గురి చేసినట్లు పేర్కొన్నారు. ఇక 20 ఏళ్ల క్రితం ఈటీవీ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రామోజీరావు పై ప్రశంసల వర్షం కురిపించారు. మా అన్నయ్య చిరుకు ఉత్తమ నటుడిగా సితార అర్డు వచ్చింది. ఈవెంట్ రామోజీరావు చాలా అద్భుతంగా నిర్వహించారని తెలిసింది. అప్పుడే ఆయన పేరు మొదటిసారి విన్నాను. తన గురించి తెలుసుకున్నాను.
చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరారు అంటూ రామోజీరావు గొప్పతనాన్ని పొగిడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకపై ఆయన ఓ షాకింగ్ నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..ఫిలిం సిటీ కట్టాలనేది తన కల అని.. కానీ రామోజీరావు లాంటి ఉన్నతమైన వ్యక్తి ఫిలిం సిటీ నిర్మిస్తున్నారని తెలియగానే తన కలను వదిలేసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. అలా రామోజీరావు కోసం తన సొంత కలను వదులుకున్నాడు పవన్.