Sharwa37: షూటింగ్ స్పాట్ నుంచి సంతాపం తెలియజేసిన శర్వానంద్ మరియు చిత్ర యూనిట్

Sharwa37: ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు కొద్దిసేపటికి మరణించిన విషయం తెలిసిందే. చాలామంది సినిమా ప్రముఖులు ఈ విషయంపై నివాళులర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినిమా ప్రముఖులు తమ సంఘీభావాన్ని తెలిపారు. కేవలం సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కొంతమంది షూటింగ్ ప్రదేశాల నుంచి కూడా నివాళులు అర్పిస్తున్నారు.

Ramoji Rao

ఇకపోతే ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రిలీజ్ చేసిన ఫోటోలు ప్రముఖ కమెడియన్, హీరో సునీల్, కమెడియన్ రఘు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, దర్శకుడు శంకర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా కనిపిస్తున్నారు. ఫోటోతోపాటు వీడియోలు కూడా పోస్ట్ చేశారు.

- Advertisement -

మనమే సినిమాతోసక్సెస్

ఇకపోతే రీసెంట్గా మనమే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతుంది. చాలామంది ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే శర్వానంద్ రీసెంట్ టైమ్స్ లో వరుస హిట్ సినిమాలను అందుకుంటున్నాడు అని చెప్పొచ్చు. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

శర్వానంద్ 37

అయితే ప్రస్తుతం తన 37వ సినిమాను చేస్తున్నాడు శర్వానంద్. ఇక మనమే సినిమా సెలబ్రేషన్స్ జరుగుతున్న తరుణంలోని తన నెక్స్ట్ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మరణించడం వలన షూటింగ్స్ పార్ట్ నుంచి సంతాపం తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వీడియోలో శర్వానంద్ నెల్లూరు సుదర్శన్ కమెడియన్ సత్య వంటి ప్రముఖులు కనిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు