Ram Pothineni: మైత్రీ మూవీస్ లో రామ్..క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది!

Ram Pothineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. కానీ తాను నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అగ్ర హీరోల సరసన చేరలేకపోయాడు. 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఆయిన సంగతి తెలిసిందే.

ఈ ఒక్క సినిమా మాత్రమే రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రామ్ నటించిన రెడ్, ది వారియర్స్, స్కంద చిత్రాలు పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. బోయపాటి దర్శకత్వంలో చేసిన స్కంద సినిమాపై రామ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు రామ్ మరో సినిమాతో అభిమానుల ముందుకు రావాలని చూస్తున్నారట. ఆ సినిమా ఈరోజు లాంచ్ కానుంది.

Exclusive: Ram and Mythri Movie Makers film on Cards

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రామ్ కు భారీగానే డబ్బులను అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి మహేష్ బాబు అనే దర్శకుడు పని చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. చాలా రోజుల తర్వాత పెద్ద సంస్థతో రామ్ పనిచేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా బంపర్ హిట్ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు