Kriti Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. హీరో శర్వానంద్ తో మనమే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది కృతి. ఇక ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
మొదటి సినిమాతోనే పెద్ద హిట్ అందుకున్న ఈ బ్యూటీ అనంతరం అనేక సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ప్రభావం చూపలేదు. అందుకే గత కొద్ది రోజుల నుంచి ఈ బ్యూటీ ఖాతాలో సరైన హిట్ లేకుండా పోయింది. ఇక శర్వానంద్ హీరోగా ఇటీవల విడుదలైన మనమే సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది కృతి.
జూన్ 7న ఈ మూవీ విడుదలైంది. ఇక ఈ నేపథ్యంలో కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ లెహంగాలో.. తన అందాలను ఆరబోసింది ఈ బ్యూటీ. ఇక ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. ఏ మాటకి ఆ మాట దేవతలాగా ఉన్నావు. నీ అందం చూస్తే అప్సరసలు కూడా అసూయపడతారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.