Shilpa Shetty : బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టిపై కేసు నమోదు..

Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ పలు సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా ఫేమస్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో బాగా పాపులర్ అయిన శిల్పా శెట్టి కెరీర్ తొలినాళ్లలో తెలుగులో వరుస సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని ప్లాపులు రావడం వల్ల బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ తన అందచందాలతో హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోయింది. ఇక ప్రస్తుతం 50 ఏళ్ళ వయస్సులో కూడా శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. స్లిమ్ గా మెయింటేన్ చేస్తున్నారు.

ఇక ఐపీఎల్ లో ఈ భామ రాజస్థాన్ రాయల్స్ కి ఓనర్స్ లో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శిల్పా శెట్టి అప్పుడప్పుడూ వివాదాలకు కూడా కేరాఫ్ గా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ఆ మధ్య శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తో విభేదాలతో విడిపోతుందని వార్తలు వచ్చినా తాము కలిసే ఉన్నామని వార్తలకు చెక్ పెట్టింది. రీసెంట్ గా నెల ముందు అమెరికన్ షో బిగ్ బ్రదర్‌ షో లో ఓ బడా హీరోతో తన కెరీర్ బిగినింగ్ లోనే కన్యత్వాన్ని కోల్పోయానని షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శిల్పా శెట్టిపై ఓ కేసు నమోదయింది.

A case has been registered against Bollywood heroine Shilpa Shetty

- Advertisement -

గోల్డ్ స్కీమ్ పేరుతో మోసమని శిల్పాశెట్టిపై కేసు…

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. లేటెస్ట్ గా గోల్డ్ స్కీమ్‌ (బోగస్‌ బంగారం పథకం) తో తనను మోసగించారని ఓ ముంబై వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో తనను మోసం చేశారని శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రాలు సహా వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇద్దరు డైరెక్టర్లు మరియు ఒక ఉద్యోగిపై రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరు మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, దర్యాప్తు చేయాలని బీకేసీ పోలీస్ స్టేషన్‌ను ముంబై కోర్టు ఆదేశించింది. మోసం చేసినట్లు తేలితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను కోరారు.

టివి షోలతో బిజీ బిజీ…

ఇక శిల్పాశెట్టి కి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలో తన భర్త రాజ్ కుంద్రా తో కలిసి పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇక ఈ మధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్ర జైలుజీవితం గడిపి వచ్చారు. అప్పుడు వీరిద్దరూ విడిపోతారని రూమర్స్ వచ్చాయి. కానీ అదేమీ నిజం కాదంటూ భర్తకు సపోర్ట్ గా శిల్ప శెట్టి నిలిచింది. ప్రస్తుతం పలు రకాల టివి షో లలో సందడి చేస్తూ గడుపుతుంది. భర్త తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో కనిపిస్తూ ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం శిల్పా శెట్టి (Shilpa Shetty) యాభై ఏళ్ళ వయసులోనూ యాక్టీవ్ గా ఉంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక శిల్పా శెట్టికి రాజ్ కుంద్రాకి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు వియాన్, సమీషా. ఇక త్వరలో సౌత్ సినిమాల్లో కూడా శిల్పా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు