Chiranjeevi: ఎవ్వరు ఊహించని పదవి దక్కించుకున్న చిరు.. మెగాస్టార్ మామూలోడు కాదుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి… స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా మొదట మెగాస్టార్ చిరంజీవిని కలుస్తారు. ఇక పేద, ధనికా అనే తేడా లేకుండా అందరితో… సమానంగా మెదులుతారు చిరంజీవి.

అయితే అలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. చిరుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే పాలన మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

- Advertisement -

ఇక ఇప్పుడు చిరంజీవిని రాజ్యసభకు పంపించి బీజేపీ లాభం పొందాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. కేంద్రంలో జనసేన పార్టీ నుంచి ఎవరికీ మంత్రి పదవి రాలేదు. కేవలం టీడీపీ, బీజేపీ పార్టీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. ఏపీ నుంచి మొత్తం ముగ్గురు కేంద్ర మంత్రులు అయ్యారు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ తరఫున చిరంజీవికి పదవి ఇవ్వాలని మోడీ సర్కార్‌ అనుకుంటోందట.

ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. రాజసభ్యకు చిరంజీవిని పంపి.. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా ఇచ్చే యోచనలో ఉన్నారట. మరి ఈ వార్తలో ఎంత మేరకు నిజం ఉందో త్వరలోనే క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు