Vijay Sethupathi.. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి తాజాగా మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. విజయ్ సేతుపతి 50వ చిత్రం గా వచ్చిన ఈ సినిమా ఆయన కెరియర్ కు బిగ్గెస్ట్ హిట్ అందించింది అని చెప్పవచ్చు.. ఇప్పటికే పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా విజయ్ సేతుపతికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది..
విఘ్నేష్ శివన్ తో గొడవలు..
ప్రముఖ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త.. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఈయనకు గొడవలు ఉన్నాయంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ గొడవలపై విజయ్ సేతుపతి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
గొడవలపై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి..
నానుమ్ రౌడీ థాన్.. ఈ సినిమా తెలుగులో నేను రౌడీ అనే పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. కోలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా.. షూటింగ్ మొదటి రోజు పూర్తయిన తర్వాత విఘ్నేష్ కు ఫోన్ చేసి గొడవపడ్డాను.. నువ్వు నాకు నటన నేర్పుతున్నావా..? నేను చేసేది నీకు అర్థం కావడం లేదు.. అని గట్టిగా అరిచాను. నాలుగు రోజుల తర్వాత నయనతార మా ఇద్దరితో మాట్లాడి మాకు సర్ది చెప్పింది.. విఘ్నేష్ ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది.. అందుకే నేను వెంటనే అంగీకరించాను.. షూటింగ్ ప్రారంభమయ్యాక ఆయన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.. ఇప్పుడు ఇద్దరం మంచి స్నేహితులం కూడా.. ఆ సినిమాలో నా పాత్ర తెలుసుకోవడానికి నాకు నాలుగు రోజులు సమయం పట్టింది.. అందులో కొన్ని సన్నివేశాలలో చేసేటప్పుడు అభద్రతాభావానికి నేను లోనయ్యాను.. ముఖ్యంగా విఘ్నేష్ ప్రతిభ ఉన్న డైరెక్టర్.. ఆయనను ఎవరు టచ్ చేయలేరు.. అంత గొప్పగా కథలను తీయగలరు కూడా.. ఆయనపై నమ్మకం ఉంచితే కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు అంటూ విఘ్నేష్ శివన్ పై ప్రశంసలు కురిపించారు విజయ్ సేతుపతి. మొత్తానికైతే గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా విజయ్ సేతుపతి స్పందించి క్లారిటీ ఇచ్చారు.. మరి దీనిపై విఘ్నేష్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
మహారాజా పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు..
ఇదిలా ఉండగా మహారాజా సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ సేతుపతి 50వ చిత్రం గా తెరకెక్కింది.. తాజాగా నటి కీర్తి సురేష్ ఈ చిత్రంపై పోస్ట్ కూడా పెట్టింది.. తమిళ ఇండస్ట్రీలో మహారాజా ఒక అద్భుతం… విజయ్ సేతుపతి 50వ సినిమా ట్రేడ్ మార్క్ గా నిలిచిపోతుంది.. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.. అంటూ కీర్తి సురేష్ పోస్ట్ చేసింది.