Sai Pallavi : దైవ దర్శనంలో తండేల్ టీం… ఇక్కడ సాయి పల్లవే హైలైట్

Sai Pallavi : తండేల్ చిత్ర బృందం తాజాగా శ్రీకాకుళంలో ఉన్న అరసవల్లిలో సందడి చేశారు. సినిమా షూటింగ్ కోసం శ్రీకాకుళం వెళ్ళిన చిత్ర బృందాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. అయితే అందులో అందరికంటే సాయి పల్లవే మెయిన్ హైలెట్ అని చెప్పాలి. అరసవల్లి సత్యనారాయణ స్వామి సాయి పల్లవి దర్శించుకున్న వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

సత్యనారాయణ స్వామి సన్నిధిలో..

ప్రత్యక్ష నారాయణుడు అని పిలుచుకునే అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని తండేల్ చిత్ర బృందం సందర్శించింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సెట్ కు తిరిగి వెళ్ళిపోయారు తండేల్ టీం. ఇక సత్యనారాయణ స్వామిని హీరో నాగ చైతన్య తో పాటు హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి కలిసి దర్శించుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందరి కంటే సాయి పల్లవికే ఎక్కువగా అటెన్షన్ దొరికిందని చెప్పాలి. ఆమె చుట్టూ గుమిగూడిన జనాలను నియంత్రించడం ఆలయ నిర్వాహకులకు చాలా కష్టమైంది.

Image

- Advertisement -

సాయి పల్లవి హైలెట్

సాధారణంగానే బయట ఎక్కడికి వెళ్లినా సాయి పల్లవి అసలు మేకప్ వేసుకోదు. అయినప్పటికీ ఈ నేచురల్ బ్యూటీకి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా అరసవల్లిలో కూడా ఆమెను చూడడానికి జనాలు దాదాపు ఒకరినొకరు తోసుకున్నారు. కనీసం సాయి పల్లవి కార్ వెళ్లడానికి కూడా దారి లేనంతగా చుట్టుముట్టారు. దీంతో ఆలయ నిర్వాహకులు జనాలను అదుపు చేస్తూ సాయి పల్లవిని గుడిలోకి తీసుకెళ్లి, దర్శనం అనంతరం ఆమెను జాగ్రత్తగా తిరిగి పంపించారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన సాయి పల్లవి బ్లూ కలర్ డ్రెస్ లో మేకప్ లేకుండా సాధారణం అమ్మాయిలా కన్పించింది. అయితే సాధారణంగా అభిమానం పేరుతో చుట్టూ జనాలు ఇలా గుమిగూడితే పెద్దగా ఇష్టపడని సాయి పల్లవి అరసవల్లిలో మాత్రం నవ్వుతూ కన్పించింది.

తండేల్ షూటింగ్ అప్డేట్..

ఇక తండేల్ మూవీ విషయానికి వస్తే చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి వర్క్ షాప్స్ లో పాల్గొన్న నాగ చైతన్య, సాయి పల్లవి చురుగ్గా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవన చిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రణస్థలం, ఎచ్చెర్ల వంటి ప్రాంతాలలో పలువురు మత్స్యకార సంఘాలతో భేటీ అయి, కథను రాసుకున్నారు డైరెక్టర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడబోతున్నారు. ఇక నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ షూటింగ్ ను ఇప్పుడు శ్రీకాకుళంకు మార్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ గురించి నాగ చైతన్య, సాయి పల్లవి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఎలాంటి అడ్డంకులు లేకుండా శర వేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు