Saindhav: స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రం గా రూపొందిన మూవీ సైంధవ్. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయడంతో మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయింది. ఈ మూవీని హిందీలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం కలర్స్ సినీ ప్లెక్స్, జియో సినిమాలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు.
ఈ చిత్రాన్ని జూన్ 23వ తారీకు రాత్రి 8 గంటలకు వరల్డ్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో వెంకీ యాక్షన్ తో ఇరగదీసాడు. దీంతో ఈ మూవీ నార్త్ ఆడియన్స్ కు నచ్చుతుందని మేకర్స్ భావించారు. ఇక ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.