Amitabh Bachchan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా అమితాబ్ అండ్ కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబై లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అండ్ ప్రభాస్ తో పాటు నిర్మాత అశ్వినిదట్ కూడా హాజరయ్యారు. ఇక దగ్గుపాటి రానా హోస్ట్ గా వ్యవహరించిన ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కల్కి మూవీ కి సంబంధించిన బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం దాన్ని స్వయంగా అమితాబ్ కొనుగోలు చేశారు. ఆ తరువాత దాన్ని కమల్ హాసన్ కు గిఫ్టుగా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమితాబచ్చన్.. కల్కి నిర్మాత అశ్వినీ దత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఆయన కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. వెంటనే అశ్వినీ దత్ కూడా రియాక్ట్ అయ్యి వెనక్కి తగ్గారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.