Aishwarya Rai.. బాలీవుడ్లో క్యూట్ కపుల్ గా పేరుపొందిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఐశ్వర్యారాయ్ వివాహం కాకముందే మిస్ యూనివర్స్ పేరు సంపాదించింది. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ఇదిలా ఉండగా.. ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు అలా వివాహమైందో లేదో ఇలా తల్లిదండ్రులకు దూరంగా వేరే కాపురం పెట్టేస్తున్నారు.. కానీ ఈ జంట మాత్రం వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా… ఇప్పటికీ అటు బచ్చన్ ఫ్యామిలీతోనే ఐశ్వర్యారాయ్ – అభిషేక్ బచ్చన్ ఇద్దరూ ఒకే ఇంట్లోనే కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇవి రూమర్స్ మాత్రమే అంటూ కొట్టి పారేసింది ఈ జంట.. కానీ తాజా సమాచారం ప్రకారం.. సపరేట్ గా వేరే కాపురం పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని విషయాలు కూడా సాక్షాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
సపరేట్ గా ఆస్తులు కొంటున్న అభిషేక్ బచ్చన్..
ఇందుకు ముఖ్య కారణం.. అభిషేక్ బచ్చన్ ముంబైలో బోరవలి ప్రాంతంలో ఏకంగా ఆరు ఫ్లాట్లు కొనుగోలు చేశారని.. వీటి ధర సుమారుగా రూ.16 కోట్లు ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రక్రియ మే 5వ తేదీన ఈ ఏడాది పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది అభిషేక్ బచ్చన్ పేరు మీద ఉండడం గమనార్హం. ఈ ఏడాది మొదటిలో అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలిసి మహారాష్ట్రలో రూ.10 కోట్లు విలువైన ఒక ఫ్లాట్ ను కూడా కొనుగోలు చేశారు.
అమితాబ్ బచ్చన్ కూడా..
అలాగే ఈ ఏడాది అయోధ్యలో అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. గత ఏడాది అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేతానందాకు కూడా రూ.50 కోట్ల విలువ చేసే ఒక బంగ్లాను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. బాలీవుడ్లో లెజెండ్రి నటుడుగా పేరు పొందిన అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ తన నట జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.. ఇప్పటివరకు 200 కు పైగా సినిమాలలో నటించి ప్రతి పాత్రకు కూడా న్యాయం చేయగలిగారు. ముఖ్యంగా బాలీవుడ్లో బిగ్ బి గా పేరు సంపాదించారు అమితాబ్ బచ్చన్. తన కెరీర్ లో కూడా ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు. అలాగే టీవీ హోస్టుగా కూడా చేశారు.
రూ.3,100 కోట్లకు పైగా ఆస్తులు..
అమితాబ్ బచ్చన్ దేశంలోనే అత్యంత సంపన్నమైన నటులలో ఒకరిగా పేరు సంపాదించారు.. ఈయన ఆస్తి సుమారుగా రూ.3,100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా… అమితాబ్ బచ్చన్ తన తోటి నటి అయిన జయా బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. అందులో శ్వేతా బచ్చన్ ఒకరు కాగా.. అభిషేక్ బచ్చన్ మరొకరు..
అందుకే సపరేట్ కాపురం..
అయితే కుటుంబంలో విభేదాలు రావడం వల్లే సపరేటుగా అభిషేక్ బచ్చన్ ఆస్తులు కొంటున్నారట.. ఈ నేపథ్యంలోనే త్వరలోనే వేరే కాపురం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.