Neha Shetty.. డీజే.టిల్లు చిత్రంలో రాధికా క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ బ్యూటీ నేహా శెట్టి అందం గురించి, ఆమె గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇటీవల విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మొత్తానికైతే గ్లామర్ ట్రీట్ ఇచ్చేసి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు నెటిజెన్స్ ను అలరించడానికి గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు హాట్ ఇమేజ్ దక్కించుకుంటుంది నేహా శెట్టి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన మరో లేటెస్ట్ ట్రెండీ ఫోటోషూట్ యువతకు చెమటలు పట్టిస్తోంది.
అద్దం ముందు గ్లామర్ ట్రీట్..
ముఖ్యంగా అద్దం ముందు నిలబడి తన అందాల సోయగాలను చూసుకుంటూ.. ఎద అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా క్రాప్ టాప్ మోడల్ అవుట్ ఫిట్ లో నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న నేహా శెట్టి అందానికి నెటిజెన్స్ కూడా ఫిదా అవుతున్నారు.. ఈ బ్యూటీ ఫొటోస్ క్రేజీగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఆకట్టుకునే అందంతోపాటు మంచి లుక్.. అంతకుమించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఈమె టాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోషూట్ చూపు తిప్పుకోనివ్వడం లేదు అని చెప్పవచ్చు.. మొత్తానికైతే నేహా శెట్టి లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
నేహా శెట్టి కెరియర్ ..
ప్రముఖ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి.. 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే -2 చిత్రం ద్వారా కన్నడ ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.. ఆ తర్వాత మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు వంటి తెలుగు చిత్రాలలో నటించి అలరించింది. ఇక కర్ణాటకలోని మంగళూరులో తుళు మాట్లాడే హిందూ కుటుంబంలో జన్మించిన ఈమె బెంగళూరులో పెరిగింది. ఈమె తల్లి దంత వైద్యురాలు కాగా తండ్రి వ్యాపారవేత్త.. ఈమెకు చెల్లెలు కూడా ఉంది. మోడలింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించిన ఈమె.. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీలో టైటిల్ ను గెలుచుకుంది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన మెహబూబా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. సినిమా కోసమే తెలుగు భాష నేర్చుకుంది.. అయితే ఈ సినిమాలో నటన సరిగ్గా లేదని విమర్శకుడు హేమంత్ కుమార్ చెప్పడంతో ఈమె మెహబూబా సినిమా తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్స్ అభ్యసించడానికి ఆరు నెలలు ఇండస్ట్రీకి విరామం తీసుకుంది.. ఇక 2021లో మళ్లీ ఆమె రెండు సినిమాలు లో కనిపించింది.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రతో పాటు గల్లీ రౌడీలో హీరోయిన్గా నటించిన ఈమె.. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
View this post on Instagram