Rajinikanth: రజినీకాంత్ పరువు తీసిన టాలీవుడ్ హీరోయిన్ ?

Rajinikanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మమత మోహన్ దాస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యమదొంగ సినిమాతో కథానాయికగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. ఆమె నటించిన తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో కేడి, కింగ్, చింతకాయల రవి వంటి హిట్ సినిమాలు చేసి అలరించింది. ఆ సినిమాలలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. స్టార్ హీరోల సరసన జతకట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తుందని అభిమానులంతా అనుకున్నారు.

కానీ అంతా తలకిందులుగా మారింది. అయితే కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ క్యాన్సర్ బారిన పడింది. ఎన్నో పోరాటాలు చేసి క్యాన్సర్ నుంచి కోలుకుంది మమత మోహన్ దాస్. ఇక తాను సినిమాల్లో నటించదని అనుకున్న వారందరికీ మమత మోహన్ దాస్ షాక్ ఇస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలే రుద్రంగి సినిమాతో మరోసారి అదరగొట్టింది. జగపతిబాబు నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది మమత.

- Advertisement -

ఇక తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి చిత్రంలో ఈ బ్యూటీ చేసింది. ఇదిలా ఉండగా….తాజాగా స్టార్ హీరో రజనీకాంత్ సినిమాపై ఈ బ్యూటీ వివాదాస్పద వాక్యాలు చేసింది. రజనీకాంత్ హీరోగా 2008 సంవత్సరంలో వచ్చిన కథానాయకుడు సినిమాలో ఓ పాటలో నటించింది. ఇక ఈ పాట కోసం మమత రెండు రోజులపాటు షూటింగ్ కి వెళ్ళిందట. కానీ ఆ సినిమా ఎడిటింగ్ పార్ట్ లో ఆమె నటించిందంతా డిలీట్ చేసి కేవలం ఒకే ఒక్క సెకండ్ మాత్రమే తెరపై చూపించారట. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాటను చూసి మమత తెగ ఫీల్ అయిందట. అంతేకాకుండా నేను అనవసరంగా రజనీకాంత్ సినిమాలో నటించానని బాధపడిందట. ప్రస్తుతం మమత మోహన్ దాస్ చేసిన వాక్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు